ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని రుణదాత సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది క్రితం అప్పు తీసుకున్న వ్యక్తి వద్దకు రుణదాత చెప్పులు అరిగేలా తిరుగుతున్నా.. అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకుండా రోజులను దాటవేస్తూ తప్పించుకున్నాడు. దీంతో ఆ రుణదాత అనేక సార్లు పంచాయితి పెట్టించి న్యాయం కోసం వేచి చూసింది. కానీ రుణదాతకు అన్యాయమే జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అప్పు ఇచ్చిన వ్యక్తి చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సాంపేట మండలంలోని నర్సాపురం. ఇదే గ్రామంలో భర్త చనిపోవడంతో సామల మాధవి (38) అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఇదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తికి మాధవి ఏడాది కిందట లక్ష ఇరవై వేలు అప్పుగా ఇచ్చింది. దీంతో మాధవి అనేక సార్లు నా డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఆనంద్ ను అడిగే ప్రయత్నం చేసింది. కానీ ఆనంద్ మాత్రం ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకుండా రోజులు దాటవేస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇలా అయితే కాదని.., మాధవి ఇటీవల పెద్దలతో పంచాయితి పెట్టించి పోలీసుల వరకు తీసుకెళ్లింది. అయినా ఆనంద్ తీసుకున్న డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేదు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మాధవి ఇటీవల ఆనంద్ ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే స్పందించిన మాధవి కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆనంద్ ఇచ్చిన అప్పు తిరిగివ్వని కారణంగానే నేను ఆత్మహత్య చేసుకున్నట్లు మాధవి తెలిపింది. అయితే చికిత్స పొందుతూ చివరికి మాధవి ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. మాధవి మరణించడతో ఆమె కూతురు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఇదే ఘటనపై మాధవి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.