నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపట్టిన సూపర్టెక్ లిమిటెడ్కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ భవనాలను మే 22న కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కూల్చివేత పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.టెస్ట్ బ్లాస్టింగ్ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 2022 ఏప్రిల్ 10న మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 2:45 గంటల నడుమ ఈ బ్లాస్ట్ను నిర్వహించారు. జంట భవనాలకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, 13వ అంతస్థులోని 6 పిల్లర్లలో ఐదు కేజీల పేలుడు పదార్థాలతో టెస్ట్ బ్లాస్ట్ చేపట్టారు.
ఇవాళ జరిగిన ట్రయల్ బ్లాస్ట్తో ఎంత మేరకు వైబ్రేషన్స్ వచ్చాయి? శబ్ద కాలుష్యం ఎంతమేర ఉంది? ఎంత మేరకు పేలుడు పదార్థాలు వాడారు? తదితర అంశాలపై పది రోజుల్లో నివేదిక రానున్నది. ట్రయల్స్ సందర్భంగా వైబ్రేషన్స్ టెస్ట్ కోసం ఆరు చోట్ల ప్రత్యేకంగా మిషన్లను అమర్చారు. కాలుష్యాన్ని పరిశీలించేందుకు సైతం ప్రత్యేకంగా మిషన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఐఐటీ చెన్నై, సీబీఆర్ఐ, నోయిడా అధికారుల పర్యవేక్షణలో ట్రయల్స్ నిర్వహించారు.
9 సెకన్లలో..
ఈ రెండు భవనానలు కూల్చి వేసేందుకు 3,000ల నుంచి 4,000 కేజీల పేలుడు పదార్థాలు అవసరం అవుతాయని అధికారుల అంచనా. దాదాపు 9 సెకన్లలో ఈ భవంతి నేలమట్టం అవుతుందని పేలుడు పనులు దక్కించుకున్న ఎడిఫైస్ ఇంజనీరింగ్ అండ్ జెట్ డిమాలిషన్ సంస్థ తెలిపింది. మే 22న మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ట్విన్ టవర్స్ను కూల్చివేస్తామని వెల్లడించారు. కాగా కూల్చివేత సమయంలో టవర్స్కు సమీపంలోని సెక్టార్-93Aలో నివసిస్తున్న సుమారు 1,500 కుటుంబాలను ఐదు గంటల పాటు వారి ఇళ్ల నుంచి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా సైట్కు దగ్గరగా ఉన్న నోయిడా ఎక్స్ప్రెస్వేను కూడా ఒక గంట పాటు మూపివేయబడుతుందని పేర్కొన్నారు.
Low intensity blast sound heard during the blast test (mock drill) at supertech twin tower in Noida.
The building has to be demolised on 22nd May. Test was done to see as to how many kgs of explosives to be used on actual day. #SuperTech #twintower pic.twitter.com/iDS4qXDWTX
— Er. Navin Kumar Singh (@navinksingh29) April 10, 2022
ఇది కూడా చదవండి: సక్సెస్ స్టోరీ: నిందలు భరిస్తూ రూ.50 వేలతో చేసిన ప్రయత్నం రూ.20 కోట్లకు చేరింది!
ఎందుకు కూల్చేస్తున్నారు?
నోయిడా సెక్టార్ 93ఏ లో నిబంధనలు ఉల్లంఘిస్తూ సూపర్టెక రియాల్టీ సంస్థ ఎమరాల్డ్ పేరుతో 40 అంతస్థుల జంట భవనాల నిర్మాణ పనులు చేపట్టింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులో కూడా అనేక విడతలుగా విచారణ జరిగింది. చివరకు జంట భవనాలను కూల్చివేయాల్సిందే అంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే, టవర్లను కూల్చివేసేందుకు రూ.17.55 కోట్లు ఖర్చు కానుండగా.. శిథిలాలను తొలగించేందుకు మరో రూ.13.35 కోట్లు ఖర్చు కానున్నది. కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతకు అయ్యే మొత్త ఖర్చులను సూపర్టెక్ లిమిటెడ్ సంస్థ భరించనుంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.