సీఎం కేసీఆర్ గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. పటాన్ చెరువులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సీఎం ప్రకటనతో పటాన్ చెరువు భుములకు ఒక్కసారిగా డిమాండ్ పెరగనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. పటాన్ చెరువు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం కొల్లూరులో డబుల్ బెడు రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద డబుల్ బెడ్ రూం టౌన్ షిప్ కావడం విశేషం. ఆ తర్వాత పటాన్ చెరువు లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పటాన్ చెరువు వరకు మెట్రో రావాలిన అడిగారు. వచ్చే ఎన్నికల్లో మీరు మరోసారి గెలిపిస్తే ఖచ్చితంగా పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ మెట్రోను తీసుకోస్తామని హామి ఇచ్చారు. మొట్టమొదటి కేబినెట్ లోనే మెట్రో ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.
పటాన్ చెరువుకు మెట్రో?.. ఊపందుకోనున్న రియల్ ఎస్టేట్:
పటాన్ చెరువు అంటే మనకు గుర్తొచ్చేది పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ ప్రస్తుతం అనేక రకాల పరిశ్రమలో ఉన్నాయి. హైటెక్ సిటీకి కేవలం 18 కిలీమీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ది చెందింది. ఇక భూముల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఇదిలా ఉంటే, గురువారం పటాన్ చెరువుకు విచ్చేసిన సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ప్రధానంగా పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో తీసుకోస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో రియల్ ఎస్టేట్ ఎక్కసారిగా ఊపందుకోనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇప్పటికే ఇక్కడి భూముల ధరలకు భారీ డిమాండ్ ఉంది. ఇక పటాన్ చెరువు నగరానికి అతి చేరువలో ఉండడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బాగా విస్తరించింది.
ఇక పటాన్ చెరువు మెట్రో గనుక వస్తే ఈ రేట్లు మరింత పెరగడంతో పాటు భూముల ధరలకు రెక్కలొస్తాయని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. తద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందే అవకాశం లేకపోలేదు. అయితే, ఇక్కడి ప్రాంతంలో 2BHK ప్లాట్ కొనాలంటే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లెక్కల ప్రకారం.. ఏరియాను బట్టి గజానికి 16,000 నుంచి రూ.18,000 వరకు ఉంది. ఒకవేళ ఇక్కడ 150 గజాల 2BHK స్థలం కొనాలంటే మాత్రం ఖచ్చితంగా రూ.27,00,000 అవుతుంది. అయితే, పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో వస్తుందని సీఎం హామీ ఇవ్వడంతో అక్కడి భూముల ధరలకు భారీ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీని కారణంగా చాలా మంది ఇక్కడి ప్రాంతంలో ఫ్లాట్ లు, భూములు కొనే అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు కొనడం కన్నా.. సిటీ దగ్గరలోనే ప్రాంతల్లో కొనడం చాలా బెటర్ అని ముందుగానే ఆలోచిస్తున్నారు. ఒకవేళ కొన్న స్థలంలో ఇళ్లు నిర్మించకపోయిన ఆ తర్వాత ఆ ఫ్లాట్ ను అమ్ముకుంటే మరింత ధరతో అధిక లాభం పొందే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఏదేమైన పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ మెట్రో గనుక వస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో రియల్ ఎస్టేట్ అమాంతంగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.