బంగారానికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. భారతదేశంలో అయితే అకేషన్ ఏదైనా బంగారం కొనాల్సిందే అంటారు. అయితే బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు. అలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా భారతదేశంలో బంగారాన్ని తెగ కొనేస్తుంటారు. ఏ ఫంక్షన్ అయినా, శుభకార్యం అయినా బంగారం కొనాల్సిందే. అయితే బంగారం కొనే సమయంలో వినియోగదారులు కొన్ని తప్పులు చేస్తుంటారు. బంగారం క్వాలిటీ విషయంలో కొనుగోలుదారులు మోసపోతూ ఉంటారు. వాటిని అరికట్టేందుకు గతంలోనే బీఐఎస్ హాల్ మార్క్ ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలో శుక్రవారం జరగిన బీఐఎస్ సమీక్ష తర్వాత ఈ ప్రకటన విడుదల చేశారు. హాల్ మార్క్ లేని ఆభరణాల విక్రయాలను నిషేదిస్తామని కూడా ప్రకటించింది.
కానీ, కరోనా కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కేంద్రం మరోసారి ఆ అంశంపై స్పందించింది. బంగారం అమ్మాకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు అంకెల కోడ్ లేకుండా హాల్ మార్క్ చేసిన ఆభరణాల సేల్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1, 2023 నుంచి అలాంటి ఆభరణాల అమ్మకాలకు అనుమతి లేదని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆల్ఫాన్యూమరిక్ అంటే అంకెలు పదాలు కలిసి ఉంటాయనమాట. అవి లేకుండా హాల్ మార్క్ లోగో ఉన్నా కూడా ఆ ఆభరణాలు అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి HUIDతో ఉన్న బంగారు ఆభరణాలకు మాత్రమే అమ్మకాలకు అనుమతి ఉంటుందని తెలిపారు.
బంగారం కొనుగోలు చేసేవారు మోసపోతున్నారని, క్వాలిటీ, ప్యూరిటీ తెలియకుండానే కొనుగోలు చేస్తున్నారన్నారు. బంగారు ఆభరణాలపై బీఐఎస్ లోగో, 6 అంకెల అల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటేనే వాటిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. 2021లోనే కేంద్రం ఆభరణాలపై హాల్ మార్కింగ్ ని తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కరోనా సమయంలో కాస్త ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి కచ్చితంగా హాల్ మార్కింగ్ తో పాటుగా హెచ్ యూఐడీ ఉండాలని స్పష్టం చేశారు. అలా లేని పక్షంలో ఆ బంగారు ఆభరణాలపై నిషేధం ఉంటుందని ప్రకటించారు. బంగారు ఆభరణాల విషయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.