అక్షయ తృతీయను పురస్కరించుకుని.. జ్యువెలరీ స్టోర్స్ అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలానే పాత బంగారం ఎక్స్చేంజ్ చేస్తే.. గ్రాము మీద మరి కొంత ఎక్స్ట్రా డబ్బలును చెల్లిస్తాం అని పేర్కొంటున్నాయి. అయితే పాత బంగారం ఎక్స్చేంజ్ విషయంలో.. షాపు యజమానులు.. కస్టమర్లను దారుణంగా మోసం చేస్తారని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఆ వివరాలు..
బంగారానికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. భారతదేశంలో అయితే అకేషన్ ఏదైనా బంగారం కొనాల్సిందే అంటారు. అయితే బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు. అలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.