దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు వీటితో నడిచే వాహనాలు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతే కాకుండా పెట్రో, డీజిల్ వాహనాల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు.
దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు వీటితో నడిచే వాహనాలు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతే కాకుండా పెట్రో, డీజిల్ వాహనాల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే వీటిపై కొంత అవగాహన లోపం, కొంత నెగిటివిటీ గూడు కట్టుకుని ఉంది. ఈ నేపథ్యంలో అంత పెట్టి ఈ వాహనాలు కొనుగోలు చేయడం అవసరమా అని ఆలోచిస్తున్నారు. అయితే అవగాహన పెరిగి, వీటి ఉపయోగం తెలిసిన వాళ్లు ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం కూడా అటువంటి వారికి సహకారం అందించింది. అదే ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ అందించింది.
ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ అందించే ఫేమ్ స్కీమ్ను 2019లో ఏప్రిల్ 1న తీసుకువచ్చింది కేంద్రం. ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైనా బస్సు, కారు, బైక్, స్కూటర్ వంటివి కొనుగోలు చేస్తే సబ్సిడీ లభిస్తుంది. 7 వేల ఎలక్ట్రిక్ బస్సులు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రివీలర్లు, 55 వేల ఎలక్ట్రిక్ కార్లు, 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ కారణంగానే కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నాయి. అయితే వాహనాల కొనుగోలు సబ్సిడీపై కేంద్రం కోత పెట్టింది. 40 శాతం నుంచి 15 శాతానికి సబ్సడీని తగ్గించింది. దీని వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు పెరగడంతో కొనుగోళ్లు పడిపోయాయి. దీంతో ఫేమ్ 2 (40 శాతం నుంచి 15 శాతానికి సబ్సిడీ) స్కీమ్ తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ గడువు ముగిసినప్పటికీ పలుమార్లు పొడిగించారు.
అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే ఫేమ్ 2 సబ్సిడీ ఫథకాన్ని పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పథకం 2024 మార్చి వరకు అందుబాటులో ఉండగా.. దీనిపైనే కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి సబ్సిడీ స్కీమ్ పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ హనిఫ్ ఖురేషీ ప్రకారం.. ‘ఫేమ్ 2 స్కీమ్ మార్చి 2024లో ముగుస్తుంది. కానీ, ఈ స్కీమ్ మరికొన్నాళ్ల పాటు కొనసాగించాలని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కోరుతున్నాయి. రూ. 10 వేల కోట్లతో తీసుకొచ్చిన ఫేమ్ 2 స్కీమ్ ఐదేళ్ల తర్వాత మార్చి 2024తో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ పథకాన్ని పొడిగించాలా, ప్రయోజనాలను అందించాలా అనే విషయంపై యోచిస్తున్నాం’ అని ఫిక్కీ అవార్డుల సందర్భంగా పేర్కొన్నారు ఖురేషీ. ఇది కనుక నిజమైతే.. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలన్న వారికి భారీ ఊరట కలుగుతుంది.