జులై 15న ఓలా స్కూటర్ బుకింగ్ లు ప్రారంభమయ్యాయి. రూ. 499తో ఈ స్కూటర్లను బుక్ చేసుకునే అవకాశాన్ని ఓలా కల్పించింది. బుకింగ్ లు ప్రారంభమైన 24 గంటల్లోనే ఏకంగా లక్షకు పైగా బుకింగ్ లు జరిగాయి. మొత్తం 10 రంగుల్లో ఈ స్కూటర్లు వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ఈ రంగులను కూడా ఓలా ఇప్పటికే విడుదల చేసింది. మరోవైపు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న స్కూటర్లను విడుదల చేస్తున్నామని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ప్రకటించారు.
స్కూటర్ ఫీచర్లు, బుక్ చేసుకున్న వారికి ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.. వంటి వివరాలు ఆరోజే ప్రకటిస్తామన్నారు. ఈ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 3.6 kWh కి దగ్గరగా ఉంటుంది. భారతదేశంలో విక్రయించబడుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలల్లోని అత్యధిక సామర్థ్యాల్లో ఇది ఒకటి. కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఓలా స్కూటర్ను 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ 50 శాతం ఛార్జ్తో 75 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. 100 శాతం ఛార్జింగ్ చేయడం ద్వారా గరిష్టంగా 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
ఓలా స్కూటర్ మొత్తం 10 కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో మ్యాట్, మెటాలిక్, పాస్టెల్ అనే మూడు వేర్వేరు ఫినిష్లు ఉన్నాయి. సిటీ రైడ్ కోసం దీనిని సిద్దం చేస్తున్నారని చెబుతున్నప్పటికీ రాబోయే కాలంలో దీనిని హైవే కోసం కూడా ఉపయోగించవచ్చు.మొత్తం 10 రంగుల్లో ఈ స్కూటర్లు వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ఈ రంగులను కూడా ఓలా ఇప్పటికే విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో మన దేశంలోనే ఈ స్కూటర్లను తయారు చేస్తున్నారు. ఈ స్కూటర్లపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Thanks to all who have reserved our scooter!
Planning a launch event for the Ola Scooter on 15th August. Will share full specs and details on product and availability dates. Looking forward to it! 😀
— Bhavish Aggarwal (@bhash) August 3, 2021