మన జీవితంలో ప్రతీ ఒక్కరికి అనుకోని ప్రమాదాలు, సంఘటనలు జరుగుతాయి. ఈ ప్రమాదం వల్ల మన కుటుంబ ఆర్థిక సురక్షతను అపాయంలో పడేయవచ్చు. అయితే అలాంటి విపత్కర సమయాల్లో ఆర్థికంగా మనల్ని మనం రక్షించుకునేందుకు వెసులుబాటు మనకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తుంది. దీంతో నేటి కాలంలో అనేక మంది ఉద్యోగులు ముందు జాగ్రత్తగా వ్యవహరించి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటుంటారు. కానీ ఇలా పాలసీ తీసుకునే క్రమంలో చాలా మంది చాలా రాకల పొరపాట్లు చేస్తుంటారు. అయితే కొందరు పాలసీదారులు చేసే పొరపాట్లు ఎలా ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పాలసీ పేరుతో అనేక మంది పాలసీదారులు ఒక్కటి కాకుండా అనేక ఇన్సూరెన్స్ కంపెనీల్లో పేర్లు నమోదు చేసుకుంటుంటారు. ఇక ఇదే కాకుండా గ్రాండ్ పేరెంట్స్ చేసే తప్పు పిల్లల (లేదా మనవడు) పేరుతో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం చేస్తుంటారు. దీని ద్వారా కూడా అనేక సమస్యలు తలెత్తవచ్చు. ఒక వ్యక్తి తన కారు లేదా బైక్కు బీమా తీసుకోవడంలో సమస్య ఉండదు. ఇన్సూరెన్స్ సంస్థలు ఈ ప్రవర్తన గమనించి “రిటర్న్ ఆఫ్ ప్రీమియం” ప్రొడక్టులను ప్రారంభించాయి. 20 లేదా 25 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించిన ప్రీమియం ద్రవ్యోల్బణం కారణంగా దాదాపు మొత్తం విలువను కోల్పోయిందని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు.
వీటితో పాటు చిన్న వయస్సులో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. రెండవది భవిష్యత్తులో ఉపాధి, అనారోగ్య విషయంలో, పాలసీని తిరస్కరించవచ్చు లేదా భారీ ప్రీమియంలతో రావచ్చు. కాబట్టి ఎవరైనా యవ్వనంగా తేవి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని చెప్పకతప్పదు. మరో పొరపాటు ఏంటంటే? ఆరోగ్యం లేదా అలవాట్లకు సంబంధించిన అంశాల పట్ల తప్పుగా పేర్కొంటారు. అలాంటి సమస్య ఏదైనా తర్వాత వెలుగులోకి వస్తే పాలసీ పూర్తిగా శూన్యం అవుతుంటాయి.