పొదుపు పథకాలు అనగానే మనకు గుర్తొచ్చే పేరు.. పోస్టాఫీసు. రిస్క్ లేకపోవడం, ప్రభుత్వ గ్యారంటీ ఉండడం వల్ల ప్రజలకు పోస్టాపీసు స్కీమ్స్ పై అపార నమ్మకం. వడ్డీ రేట్లు క్రమ క్రమంగా తగ్గుతున్నా కూడా వీటిపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరిగిందే గానీ తగ్గలేదు. అలాంటి పొదుపు పథకాల్లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.. గ్రామ సురక్షా యోజన ఒకటి. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం కాబట్టి, మెచ్యూరిటీ వరకు పెట్టుబడులకు ప్రభుత్వ రక్షణ ఉంటుంది.
19 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వారంతా ఈ పథకంలో చేరేందుకు అర్హులు. సమ్ అష్యూర్డ్ అమౌంట్ రూ.10వేల నుంచి రూ.10లక్షల వరకు ఎంచుకోవచ్చు. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి ప్రీమియం చెల్లించొచ్చు. ప్రీమియం చెల్లించడానికి ఇన్వెస్టర్లకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇక పాలసీ కొనుగోలు చేసిన నాలుగేళ్లకు లోన్ కూడా పొందొచ్చు. అలాగే ఈ స్కీమ్లో జాయిన్ అయిన వారికి సంవత్సరానికి రూ.1000కు రూ.60 బోనస్ ఇస్తుంది పోస్టాఫీస్.
35 లక్షల ప్రయోజనం ఎలా పొందాలంటే!
ఇందుకు మీరు ప్రతి నెలా 1500 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే రోజు రూ.50 పొదుపు చేస్తే చాలు. ఉదాహరణకు.. ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. అప్పుడు అతని నెలవారీ ప్రీమియం 55 సంవత్సరాల వరకు రూ. 1515 చెల్లించాలి. అలాగే 58 సంవత్సరాలకు రూ.1463, 60 సంవత్సరాలకు రూ. 1411 చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత పాలసీ కొనుగోలుదారు 55 సంవత్సరాలకు రూ. 31.60 లక్షలు, 58 సంవత్సరాలకు రూ. 33.40 లక్షలు, 60 సంవత్సరాలకు రూ. 34.60 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనం పొందుతారు. ఒకవేళ పాలసీదారుడు అర్ధాంతరంగా మరణిస్తే, నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఆ పథకానికి సంబంధించిన డబ్బు అందిస్తుంది పోస్టాఫీస్. మీలో ఎవరైనా.. ఈ పథకంలో చేరాలనుకుంటే.. దగ్గరలోని పోస్టాపీసును సంప్రదించండి. ఈ స్కీం పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కరెన్సీ నోటుపై ఈ సీరియల్ నెంబర్ ఉంటే రూ.3 లక్షలు మీవే!
ఇది కూడా చదవండి: పిల్లల కోసం పొదుపుచేయాలనే వారికి గుడ్ న్యూస్.. రూ. 32 లక్షలు పొందే ప్రయోజనం!