ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి స్మార్ట్ సిటీలను డెవలప్ చేయనుంది ప్రభుత్వం. ఈ క్రమంలో అమరావతి, కాకినాడ, వైజాగ్, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దనుంది. స్మాట్ సిటీగా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుంటుంది. అందుకే ఇప్పుడే కొన్ని స్థలాలను కొని పెట్టుకుంటే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మరి ఏ ఏ ఏరియాలు పెట్టుబడికి అనుకూలంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో తిరుపతి ఒకటి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైయున్న తిరుపతి నిత్యం లక్షల భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. ఈ నగరం స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా మరింత అభివృద్ధి కానుంది. ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ సిటీల్లో తిరుపతి నగరం కూడా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిరుపతిని స్మార్ట్ సిటీగా డెవలప్ చేసే పనులు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదగడానికి తిరుపతి సిటీ అపారమైన పొటన్షియల్ కలిగి ఉంది. ఈ నగరం యాత్రికులను, భక్తులను ఆకర్షిస్తున్న కారణంగా ఈ ఏరియాలో హోటల్స్, రిసార్ట్స్, ఇతర ఆతిధ్య సంబంధిత ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు పలు కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఈ కారణంగా రెసిడెన్షియల్ స్థలాలు, కమర్షియల్ స్థలాలకు డిమాండ్ పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో తిరుపతిలో ఏ ఏ ఏరియాల్లో ల్యాండ్ కొనుగోలు చేస్తే బాగుంటుంది అనే దాని గురించి నిపుణులు కొన్ని ప్రాంతాలను సూచిస్తున్నారు. వాటిలో మొదటిది రేణిగుంట. ఆ తర్వాత తిరుచానూరు, ఏర్పేడు, చంద్రగిరి, మంగళం రోడ్డు ఉన్నాయి. స్థలాలే కాకుండా ఇళ్ళు కొనుక్కోవడానికి, పాపులర్ ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. మంచి అనువైన ప్రదేశంలో, అద్భుతమైన కనెక్టివిటీతో విలాసవంతమైన సదుపాయాలతో ఇండ్లు కూడా ఉన్నాయి. ఈ ఏరియాల్లో ల్యాండ్ రేట్లు చూసుకుంటే.. రేణిగుంటలో స్థలం కొనాలంటే చదరపు అడుగు రూ. 1,150 పలుకుతోంది. తిరుచానూరులో రూ. 1800 ఉంది. ఏర్పేడులో రూ. 950, చంద్రగిరిలో రూ. 2 వేలు, మంగళంలో రూ. 3 వేలు ఉన్నాయి. అంటే ఈ ఏరియాల్లో గజం స్థలం రూ. 8,550 నుంచి రూ. 27 వేల రేంజ్ లో ఉన్నాయి.
ఇవి కాకుండా దామినేడు, తొండవాడ, వికృతమాల, పల్లంపేట ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ కాస్త సానుకూలంగానే ఉంది. దామినేడులో చదరపు అడుగు రూ. 2,250 ఉండగా.. తొండవాడలో రూ. 1,900, వికృతమాలలో రూ. 950, రూ. పల్లంపేటలో రూ. 800 రేంజ్ లో ఉన్నాయి. అంటే గజం రూ. 7,200 నుంచి రూ. 20,250 మధ్యలో ఉన్నాయి. ఈ ఏరియాల్లో స్థలం కొంటే రెండేళ్లలో మంచి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తిరుపతి నగరం స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందితే అక్కడ రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కనుక ఈ ఏరియాల్లో ఒక పది లక్షల నుంచి 20 లక్షల బడ్జెట్ లో ల్యాండ్ ఊహించని లాభాలు పొందే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.