బిగ్ బాస్ ప్రస్తుత సీజన్ యమ ఇంట్రెస్టింగ్ గా ఉంది. గొడవలు, గిల్లికజ్జాలు అప్పుడే మొదలైపోయాయి. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ డైరెక్ట్ గా ఎలిమినేషన్ కి నామినేట్ అయిపోయారు కూడా. దానికి తోడు కెప్టెన్ కావాలనే ఆలోచనలు కూడా అందరికీ అప్పుడే వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ యూట్యూబర్ ఆదిరెడ్డి ఆ పనిలో ఉండగా, ఇప్పుడు గీతూ కూడా కెప్టెన్సీ కోసం అప్పుడే కలలు కనేస్తోంది. మిగతా ఇంటి సభ్యులపైనా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు అవి కాస్త వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6లో తొలి టాస్క్ విజయవంతంగా ముగిసింది. క్లాస్-మాస్-ట్రాష్ అని గ్రూపులుగా పెట్టి, ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడించారు. ఇవన్నీ పూర్తయి.. ఫైనల్ గా ట్రాష్ లో అభినయ శ్రీ, ఇనయా, బాలాదిత్య మిగిలిపోయారు. డైరెక్ట్ గా ఎలిమినేషన్ కి నామినేట్ అయిపోయారు. ఇక క్లాస్ లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి.. ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయిపోయారు. ఈ క్రమంలోనే క్లాస్ ఏరియాలో కూర్చుని గీతూ.. అప్పుడే కెప్టెన్సీ గురించి కలలు కనడం మొదలుపెట్టేసింది.
‘నేను గానీ కెప్టెన్ అయిన తర్వాత ఎవరన్నా మధ్యలో రావాలి చెప్తా.. ఎవరికి వాళ్లు మేమే లీడర్స్ అనుకుంటూ అన్నింట్లో వాళ్లే దూరుతున్నారు. నేను కెప్టెన్ అయినాక ఎవ్వరినీ మాట్లాడనివ్వను. ఇది నా మాట నా మాటే శాసనం. తెలియకుండా మాట్లాడనిచ్చి, వీళ్లని మనమే లీడర్స్ చేస్తున్నాం’ అని శివగామి స్టైల్లో గీతూ కౌంటర్స్ వేసింది. ఆ మాటలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇనయాని టార్గెట్ చేసిన గీతూ.. ఆమెతో అన్ని పనులు చేయించుకుంది. మిగతా వాళ్లతోనే చాలా అగ్రెసివ్ గా వ్యవహరించింది. దీనిపై నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. మరి గీతూ ఆటతీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: గీతూ,ఆదిరెడ్డి, నేహా సేఫ్.. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్స్!?