బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనుకున్న దానికంటే ఉత్కంఠగా, భారీ భారీ ట్విస్టులతో సాగుతోంది. మొదటి టాస్కుతో గ్రూపులుగా చేసిన బిగ్ బాస్ వారిని ఇప్పుడప్పుడే కలవనిచ్చేలా లేడు. ఇకనుంచి వారి మధ్య దూరం పెరిగేలా ఉందే తప్ప అంతా కలిసేలా లేదు. టాస్కుతోనే ట్విస్ట్ ఇచ్చాడు అనుకుంటే ఆ ట్విస్టులు, ఉత్కంఠను చివరి వరకు లాక్కొచ్చేలా ఉన్నాడు. అటు నామినేషన్లలోనూ అలాంటి ఊహించని పరిణామాలే ఎదురయ్యాయి. ఈ వారం నామినేషన్లలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. బిగ్ బాస్ ప్లాన్ వల్ల మొదట నామినేషన్స్ లో లేని ఆరోహి మళ్లీ నామినేషన్స్ లోకి వచ్చింది. ఒకరిని స్వాప్ చేయండంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.
ఈవారం నామినేషన్స్ లో రేవంత్, చంటి, అభినయశ్రీ, ఆరోహి, ఇనయా సుల్తానా, శ్రీసత్య ఉన్నారు. మొదట బాలాదిత్య ఉండగా.. క్లాస్ సభ్యులు చేసిన స్వాప్తో ఆరోహీ నామినేషన్స్ లోకి వచ్చింది, ఆదిత్య సేవ్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు అంతా ఇప్పటివరకు మరీనా- రోహిత్ ఇద్దరూ వేరు వేరు సభ్యులు, పోటీదారులు అనుకుంటూ వచ్చారు. అయితే అది కాదని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు. నామినేట్ చేయాల్సి వచ్చినా ఇద్దరినీ కలిపే చేయాలి. అలాగే ఎలిమినేట్ కావాల్సి వచ్చినా ఇద్దరూ కలిసే ఎలిమినేట్ అవ్వాలి అంటూ బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాకుండా వాళ్లు ఇద్దరూ కలిసే నామినేట్ చేయాలని చెప్పారు. ఇద్దరూ అనుకుని ఒకే పేరు చెప్పాలంటూ చెప్పారు.
అయితే బిగ్ బాస్ కొత్తగా ఈ ట్విస్ట్ ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. గతంలో రియల్ కపుల్ వరుణ్ సందేశ్- వితికా షేరీ ఉన్న సమయంలో ఇద్దరినీ వేరు వేరు సభ్యులుగానే చూశారు. ఇద్దరూ విడిగానే నామినేట్ చేశారు, నామినేట్ అయ్యారు, ఎలిమినేట్ కూడా ఇద్దరూ విడిగానే అయ్యారు. వితికా 11వ వారంలో ఎలిమినేట్ అయితే.. వరుణ్ సందేశ్ టాప్-5కి వచ్చాడు. అయితే ఇప్పుడు ఎందుకు కొత్తగా రూల్ తీసుకొచ్చారు అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఆ విషయం వాళ్లకు ముందే చెప్పుంటారు. ప్రేక్షకులకు, ఇంట్లోని సభ్యులకు మాత్రం నామినేషన్ సమయంలో రివీల్ చేశారు. ఒకవేళ ఒకేసారి 21 మందిని ఇంట్లోకి పంపినందుకే ఇలా చేశారేమో అనే టాక్ వినిపిస్తోంది. మరి.. మరీనా- రోహిత్ ఇద్దరూ ఒకరే అనే కాన్సెప్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.