నేటికి కూడా మన సమాజంలో ఆడపిల్ల అంటే చిన్నచూపు. అమ్మాయి పుడితే మైనస్.. ఖర్చు తప్ప లాభం ఉండదు అని ఆలోచించే కుటుంబాలు కోకొల్లలు. అయితే తల్లిదండ్రులు ఆలోచించని అంశం ఏంటంటే.. ఆడపిల్లలకు కూడా తగిన సహాకారం అందించి.. ప్రోతాహిస్తే.. మగపిల్లాడి కంటే ఎక్కువ విజయం సాధిస్తారు. దీన్ని నిజం చేసి చూపింది షేక్ షామిలి అనే యువతి. తనపై ఎంతో నమ్మకం ఉంచి.. చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. టీసీఎస్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం పొందింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: టీసీఎస్ అరుదైన ఘనత…కరోనా సమయంలో కూడా!..
సాధారణ ముస్లిం కుటుంబానికి చెందిన షేక్ షామిలి స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన రహంతుల్లా, సాజిదల రెండో కుమార్తె షేక్షామిలి. చిన్నతనం నుంచే చదువలో ముందుండేది. ఈమె శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసింది. మూడో సంవత్సరంలోనే ఆమెకు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చెన్నైలోని టీసీఎస్లో అవకాశం లభించింది. ఈ క్రమంలో షామిలి ప్రతిభను గుర్తించిన కంపెనీ ఆమెను సీనియర్ మేనేజరుగా నియమిస్తూ సోమవారం నియామకపత్రం పంపింది. సంవత్సరానికి రూ.40 లక్షలు వేతనం అందించనుంది. షామిలి ప్రతిభను పలువురు అభినందించారు. కుమార్తెని చూసి తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.