Somu Veerraju: బీజేపీ నేతల అమలాపురం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోము వీర్రాజు పర్యటనను పోలీసులు అడ్డుకోవటం వివాదానికి దారి తీసింది. ఆ వివాదం కాస్తా సోము వీర్రాజు ఎస్ఐని తోసేసే పరిస్థితికి తీసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పలువురు నేతలతో కలిసి అమలాపురం పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా జొన్నాడ దగ్గర పోలీసులు సోము వీర్రాజును అడ్డుకున్నారు. దీంతో సోము వీర్రాజు, ఎస్ఐల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన సోము వీర్రాజు పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు.
కోపంగా ఎస్ఐని పక్కకు తోసేశారు. దీంతో పోలీసులు ఆయన్ని రావులపాలెం పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల్ని మానసికంగా భ్రయభ్రాంతులకు గురిచేస్తోందని, వారికి ధైర్యం చెప్పటానికే వెళ్లామని అన్నారు. ప్రభుత్వం తప్పు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే బీజేపీ చూస్తూ ఉరుకోదన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : SSC Exams Reverification: 10th క్లాస్ ఫలితాల్లో మీకు తక్కువ మార్కులు వచ్చాయా? ఇలా చేయండి