కేఏ పాల్.. ఈ పేరు వినగానే.. ఆయన నోటి నుంచి వెలువడే కామెడీ డైలాగ్లు, పిచ్చి చేష్టలు ఇవే గుర్తుకు వస్తాయి. కేఏ పాల్ అనగానే కామెడీ పీస్ అనే ఫీలింగ్ మనసులోకి వచ్చేస్తుంది. దానికి తగ్గట్టే మీడియా ఆయనను ఎగతాళి చేస్తూ.. ఆయన మీద కామెడీ వీడియోలు చేస్తూ.. కించపరుస్తుంది. కానీ కొన్ని ఏళ్ల క్రితం కేఏ పాల్ అంటే ఓ ప్రభంజనం.. సంచలనం. ఆయన కోసం, ఆయన ఇచ్చే ఇంటర్వ్యూల కోసం ప్రపంచ మీడియా పడిగాపులు కాసేది. మన దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు సహా.. ప్రపంచాధినేతలు సైతం కేఏ పాల్తో ఒక్క ఫోటో కోసం ఆసక్తి కనబరిచేవారు. ఇక ఆయన ప్రసంగాల కోసం ప్రపంచ నలుమూలల ఉన్న ప్రజలు ఎదురు చూసేవారు.
మరి ఇంత ఖ్యాతి సాధించిన కేఏ పాల్ పరిస్థితి నేడు ఇలా ఎందుకు దిగజారిపోయింది అంటే.. అందుకు ఒకే ఒక్క ప్రధాన కారణం రాజకీయాలు. ఆయనతో పరిచయం కోసం ఉవ్విళ్లూరిన రాజకీయ నాయకులు.. ఆయన ఖ్యాతిని.. తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవాలని భావించారు. కానీ అందుకు ఆయన అంగీకరించకపోవడంతో.. ఆయనపై బురద జల్లి.. కేసులు పెట్టించి.. మీడియాలో వ్యతిరేక వార్తలు ప్రచారం చేసి.. నేడు మనం చూస్తున్న కేఏ పాల్గా దిగజర్చారు. ఆయన జీవితం గురించి తెలుసుకుంటే.. ఆయన ఖ్యాతి, పేరు ప్రఖ్యాతులు సాధించిన ఘనతలు తెలుసుకుంటే ఆయనపై ఉన్న చులకన భావం పూర్తిగా తొలగిపోతుంది. ఆ వివరాలు ఏంటో చూడండి.
పదో తరగతి ఫెయిల్..
కేఏ పాల్.. అలియాస్ కిలారి ఆనంద్ పాల్ మన తెలుగు వాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా.. నెల్లిమర్ల దగ్గర, చిట్టి వలస అనే మారుమూల గ్రామంలో జన్మించాడు. పదో తరగతి రెండు సార్లు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఇక చదువు తనకు అబ్బదని అర్థం చేసుకుని.. నెల్లిమర్లలో ఉన్న జూట్ మిల్లులో నెలకు మూడు వందల రూపాయల వేతనం లభించే పని దొరికితే చాలనుకున్నాడు. అందుకోసం ఓ డొక్కు సైకిలేసుకుని.. జూట్ మిల్లు చుట్టూ.. లెక్కలేనన్ని సార్లు తిరిగాడు. ఉద్యోగం సంపాదించుకోవడం కోసం కాస్తాకూస్తో లంచాలు కూడా ఇచ్చుకున్నాడు. కానీ పని దొరకలేదు. ఆ బాధ, అవమానాల నుంచే.. గొప్పగా ఎదగాలనే కసి పుట్టింది.
జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన అదే..
ఇదే సమయంలో పుట్టుకతో హిందువు అయిన కేఏ పాల్ కుటుంబం హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారింది. దాంతో కిలారి ఆనంద్ కాస్త.. కేఏ పాల్ అయ్యాడు. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. తండ్రికి తోడుగా మత ప్రచారకులతో దేశమంతా తిరిగాడు. వందలమంది మత ప్రచారకులతో పరిచయం ఏర్పడింది. వేల కొద్ది ప్రచార సభల్లో పాల్గొన్నాడు. ఆ క్రమంలో ఆయన గమ్యం ఊహించని విధంగా మారిపోయింది. దేశ విదేశాల్లో ఉన్న మత పెద్దలు, ప్రచార కర్తల పరిచయం కేఏ పాల్ జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పింది. అప్పటి వరకు కేవలం తెలుగు భాష మాత్రమే వచ్చిన కేఏ పాల్.. వెంటనే కృత నిశ్చయంతో ఆంగ్లం సహా అనేక భాషలు నేర్చకున్నాడు.
ఇది కూడా చదవండి: KA Paul: నా భార్య 68 రోజుల పాటు ఐసీయూలో ఉంది.. దేవుడితో దెబ్బలాడి తనను బతికించుకున్నాను: కేఏ పాల్
పాల్ పట్టుదల ఎంత బలంగా ఉండేది అంటే ఆయన నేర్చుకున్న ఆయా భాషాలపై అక్కడి స్థానికులకన్నా.. ఈయనే ఎక్కువ పట్టు సాధించాడు. క్రమంగా కేఏ పాల్ కూడా మత ప్రచారకుడిగా మారాడు. విదేశాల నుంచి కోట్లాది రూపాయల నిధులు వచ్చేవి. అలా వచ్చిన సొమ్ముతో మెదక్ జిల్లాలో 1000 ఎకరాల్లో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. గ్లోబల్ పీస్ పేరుతో సంస్థను స్థాపించి.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులుకు ఆర్థిక సాయం అందించాడు. అమెరికా అధ్యక్షుడి కన్నా ముందే.. బోయిగ్ 747 ఎస్పీ విమానం కలిగిన ఉన్న తొలి వ్యక్తిగా కేఏ పాల్ రికార్డు సృష్టించాడు.
వారి కన్ను పడింది.. జీవితం తారుమారయ్యింది..
గ్లోబల్ పీస్ ఇండియా పేరుతో విశ్వశాంతి కోసం చేసే ప్రయత్నాల్లో 30 ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రపంచ దేశాలన్ని తిరిగేశాడు. వైఎస్సార్, కేసీఆర్, చంద్రబాబు సహా.. మన దేశంలోని అన్ని రాష్ట్రాల మృఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు కేఏ పాల్పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఒక్క మాట చెబితే.. వందల, వేల కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చే అంతర్జాతీయ స్థాయి దాతలు ఉండేవారు. అయితే తనను ఓ మత ప్రచారకుడిగా చూడవద్దని.. ప్రపంచ శాంతి కోసం పాటుపడే వ్యక్తిగా చూడాలని కేఏ పాల్ కోరేవారు. ఇలా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కేఏ పాల్పై అప్పటి రాజకీయ నేతల కన్ను పడింది. దాంతో ఆయన జీవితం తారుమారయ్యింది.
ఇది కూడా చదవండి: KA Paul: వైఎస్ నన్ను నాశనం చేయాలని చూశాడు. కానీ.. ఆయనే భూస్థాపితమైపోయాడు : KA పాల్
అప్పటి రాజకీయ నాయకులు తమ పార్టీ ఎన్నికల ఖర్చు కోసం నిధులు ఇవ్వాల్సిందిగా కేఏ పాల్ని కోరారు. కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. దాంతో ఆయనపై కక్ష గట్టిన నేతలు.. క్రమంగా పాల్పై విషం చిమ్మారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. ఆయనపై అక్రమ కేసులు పెట్టి.. తప్పుడు ఆరోపణలు చేశారు. వాటిని మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చూశారు. ఆ వార్తలను ప్రపంచం అంతా వ్యాపించేలా చేశారు. పాల్ను దెబ్బకొట్టడమే కాక.. ఆయన మూలాలను సమూలంగా నాశనం చేయడం కోసం తప్పుడు ప్రచారాలు చేయించారు. విదేశాల నుంచి వచ్చే నిధులను సొంతానికి వాడుకుంటున్నాడని.. వేల కోట్ల రూపాయలు సంపాదించాడని పుకార్లు రేపారు. వాటిని విదేశాల్లోని మత సంస్థలకు తెలియజేసి అక్కడ నుంచి నిధులను రాకుండా అడ్డుకున్నారు. తాము కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా కేఏ పాల్ను దిగజార్చే ప్రయత్నం చేశారు. చివరకు ఆయనను జైలుకు సైతం పంపించి.. భారతీయుల గొప్పదనం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు.
ఇది కూడా చదవండి: KA Paul: యాంకర్కే చుక్కలు చూపించిన KA పాల్! మొత్తం పిచ్చ కామెడీ!
అమెరికా మీడియా అంతా ఏకమైనా పాల్ తెల్ల వెంట్రుక కూడా పీకలేకపోయింది. కానీ.. స్వదేశంలో మన వాళ్లే ఆయనను ముంచేశారు. ఆయన తన బోయింగ్ గురించి చెప్పినా.. దేశాధ్యక్షులతో తన సంబంధాల గురించి చెప్పినా.. ఆయనో కామెడీ పీస్ అనుకుంటున్నారు. ఇటీవలే ప్రధాని మోదీ, అమిత్ షాని కలిసిన కేఏ పాల్.. మళ్లీ తనకు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నారు. మరి కేఏ పాల్ కోరిక నెరవేరుతుందా లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.