త్వరలో రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ఉధ్యమసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.
త్వరలో రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ఉధ్యమసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన సంక్షేమ పథకాలతో ప్రజల నుంచి అఖండమైన ఆదరణను పొందింది. ఆ తర్వాత రెండవసారి కూడా అధికారంలోకి వచ్చి తిరుగులేని రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ పార్టీ మారింది. ఇక త్వరలో జరుగబోయే ఎన్నికల్లో మూడో సారి విజయఢంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు సీఎం కేసీఆర్. దీనిలో భాగంగానే నేడు ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్టు లిస్టును విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించారు గులాబీ అధినేత. తెలంగాణ భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈసారి ఏడుగురు సిట్టింగు అభ్యర్థులను మార్చారు, మిగతా సిట్టింగులందరికి అవకాశం కల్పించారు. ఇక నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహాల్ నియోజకవర్గాల టికెట్లపై క్లారిటీ రావాల్సి ఉంది.
రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను (115 స్థానాలకు) ప్రకటించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
BRS Party Chief, CM Sri KCR announced the first list of BRS candidates (115 constituencies) for the forthcoming Telangana Assembly… pic.twitter.com/LNLohVSRVm
— BRS Party (@BRSparty) August 21, 2023