ఓ జాతర హిజ్రాలు రెచ్చిపోయారు. కనిపించిన వారందరినీ డబ్బులివ్వాలంటూ హల్ చల్ చేశారు. వారి దెబ్బకు విసిగిపోయిన జనం పోలీసులకు సమాచారం అందించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి మాతృ శ్రీ గడి బాపనమ్మ తల్లి అమ్మ వారి జాతర జరుగుతోంది. ఆ జాతరకు కొందరు హిజ్రాలు వచ్చారు. అక్కడున్న దుకాణదారులను డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో దుర్భాషలు, వెకిలి చేష్టలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు జాతరకు చేరుకుని పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు.
ఇదీ చదవండి: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. దుకాణాలకు నిప్పుపెట్టిన కన్నడ భక్తులు..!
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా హిజ్రాలు గొడవకు దిగారు. కేసు పెడతామంటూ హెచ్చరించినా కూడా వెనక్కు తగ్గలేదు. కేసు పెడితే పెట్టుకో అంటూ ఎదురుతిరిగారు. ఈ ఘటన తర్వాత మన్యం ప్రాంతంలో హిజ్రాల ఆగడాలు ఎక్కువవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు అంత మంది ఉన్నాకూడా జంకకుండా ప్రవర్తించిన హిజ్రాలను చూసి అక్కడున్న జనం ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటనపై మీ ఆభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.