తనను నమ్మి వచ్చిన భార్యను ప్రాణంగా చూసుకోవాల్సిన భర్త ఆమె పాలిట శత్రువుగా మారిపోతున్నారు. చెడు సావాసాలకు లోనై.. భార్యను హింసిస్తున్నాడు.కానీ మనం చెప్పుకునే పురుష పుంగవుడు గురించి వింటే మాత్రం ఒళ్లు జలదరిస్తుంది.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడి ఉంటాయంటారు. జీవితాంతం కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటామని పెళ్లి నాడు వధూవరులు ప్రమాణాలు చేసుకుంటారు. ఈ ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్నారు కొంత మంది భర్తలు. తనను నమ్మి వచ్చిన భార్యను ప్రాణంగా చూసుకోవాల్సిన భర్త ఆమె పాలిట శత్రువుగా మారిపోతున్నారు. చెడు సావాసాలకు లోనై.. భార్యను హింసిస్తున్నాడు. దాడి చేస్తున్నాడు. కానీ మనం చెప్పుకునే పురుష పుంగవుడు గురించి వింటే మాత్రం ఒళ్లు జలదరిస్తుంది. తనకు మాత్రమే సొంతమైన భార్య దేహాన్ని.. స్నేహితులకు పంచుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్యపై.. తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడో భర్త. అయితే ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన అఖిలేష్ ధర్మరాజ్ ఇంజనీర్ చదివి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక వసంత్ పూర్ నివాసి అయిన మహిళ.. అతడిని మ్యాట్రిమెనీలో చూసింది. వీరి మధ్య పరిచయం ఏర్పడి.. ప్రేమకు దారి తీసింది. మహిళ కూడా సాఫ్ట్ వేర్ కావడం గమనార్హం. ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి 2019లో పెళ్లి పీటలు ఎక్కారు. ప్రస్తుతం దంపతులు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. మొదట్లో బాగానే ఉన్న భర్తలో మార్పులు రావడం మొదలయ్యాయి.
నిత్యం స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చి.. గంజాయి, మాదక ద్రవ్యాలు తీసుకునేవారు. అనంతరం ఆమెను హింసించేవాడు. తన స్నేహితులతో కలిసి పడుకోవాలని కొట్టేవాడు. కాదంటే సిగరెట్లతో కాల్చేవాడు. భర్త ఎదురుగానే అతడి స్నేహితులు ఆమెను లైంగికంగా వేధించేవారు. స్నేహితులతో కలిసి భర్త అత్యాచారానికి ఒడిగడుతుండగా.. తప్పించుకుని పారిపోయింది. ఇంటికి తిరిగి రావాలని, ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అతడిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ కేసు తర్వాత ఆమెపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ కేసు విత్ డ్రా చేసుకోవాలని హింసించడం మొదలు పెట్టాడు. దీంతో బాధిత మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ చేపడుతున్నారు.