ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. వృద్ధాప్యంలో రావాల్సిన హృద్యోగ సమస్యలు, చిన్న తనంలోనే వెంటాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నటుడు తారకరత్నతో మొదలైన ఈ పరంపరకు బ్రేకులు పడటం లేదు. తాజాగా మరొకరు గుండెపోటుతో మరణించారు.
గుండె రోజు రోజుకూ బలహీన పడుతోంది. పిడికడంత గుండె, సడి చప్పుడు లేకుండా హఠాత్తుగా ఆగిపోతుంది. వృద్ధాప్యంలో రావాల్సిన హృద్యోగ సమస్యలు, చిన్న తనంలోనే వెంటాడుతున్నాయి. ఇటీవల దేశ వ్యాప్తంగా ఈ మరణాలే చోటుచేసుకుంటాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా కన్నా వీటి మరణాలు ఎక్కువవుతున్నాయి. ఈ వయస్సు లేదూ, ఆ వయస్సు అని వ్యత్యాసం లేకుండా గుండె పోటుకు గురై నేలకొరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మరణాలు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. నటుడు తారకరత్నతో మొదలైన ఈ పరంపరకు బ్రేకులు పడటం లేదు. మొన్న ఓ పెళ్లిలో ఓ మధ్య వయస్కుడు, ఇంజనీరింగ్ విద్యార్థి, యువ కానిస్టేబుల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది.
తాజాగా బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో మరో ఘటన చోటుచేసుకుంది. శివ అనే వృద్ధుడు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుతో నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయి చనిపోయాడు. దశాబ్దాలుగా సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న శివ.. గురువారం కూడా తన వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు. సమోసాలు అమ్ముకుంటూ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు హుటాహుటిన తరలి వచ్చారు. 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కిషోర్ ఆధ్వర్యంలో సిబ్బంది సీపీఆర్ చేసినా శివ ప్రాణాలు నిలవలేదు.తీవ్రమైన గుండెపోటుతో శివ మృతి చెందాడని 108 సిబ్బంది నిర్ధారించారు. పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.