ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి చేతికి కట్టుతో కనిపించారు. దీంతో అసలు ఆమెకు ఏమైంది? ఆ గాయం ఎలా అయిందనేది చర్చనీయాంశంగా మారింది.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఇంతకుముందు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదోన్నతి మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను కూడా స్వీకరించారాయన. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ప్రశాంత్ కుమార్ మిశ్రాకు సన్మాన కార్యక్రమం, ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేసింది. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రోగ్రామ్ జరిగింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి కూడా ఈ ఈవెంట్కు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి జగన్తో పాటు ఆయన సతీమణి భారతి గురువారం సాయంత్రమే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి విజయవాడకు చేరుకున్నారు. సన్మాన కార్యక్రమం జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్కు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చేరుకున్నప్పుడు వైఎస్ జగన్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. ప్రశాంత్ కుమార్కు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి ఆహ్వానించారు. ఆయనకు శ్రీవేంకటేశ్వర స్వామి జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ భారతి.. చేతికి కట్టుతో కనిపించారు. ఆమె కుడి చేతికి కట్టు కట్టుకున్నారు. దీంతో భారతికి ఏమైందని అందరూ అనుకుంటున్నారు. అయితే చెయ్యి బెణకడం వల్లే ఆమె కట్టు కట్టుకున్నారని సమాచారం. భారతి చేతికి ఎలా గాయమైందో ఇంకా తెలియరాలేదు. కుడి భుజానికైన గాయానికి వైద్యుల సలహా మేరకు ఆమె కట్టు కట్టుకున్నారని తెలుస్తోంది. భారతి చేతి గాయం ఈ ఈవెంట్లో చర్చనీయాంశంగా మారింది.