ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల మొదటి ఘాట్రోడ్డులో చిరుత ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అక్కడే ఉన్న భక్తులు గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో విడిచి వెళ్లింది.
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో అప్పుడప్పుడు కృర జంతువులు ప్రత్యక్షం అవుతున్నాయి. కొన్నిసార్లు అవి మనుషులపై దాడులకు పాల్పపడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ క్రమంలో మెట్ల మార్గం గుండా తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వెళ్తోన్న భక్తులపై ఓ చిరుత మెరుపుదాడి చేసింది. ఐదేళ్ల ఓ బాలుడిని నోట కరచుకుని ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేసింది.. అక్కడ ఉన్నవాళ్లు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే వదిలివేసి వెళ్లింది. అప్పటికే చిన్నారికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గురువారం మెట్లమార్గం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు భక్తులు. మార్గంలోని ఏడవ మైలురాయి వద్దకు రాగానే.. అకస్మాత్తుగా ఓ చిరుత భక్తులపై దాడి చేసింది. ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి కొంతదూరం తీసుక వెళ్లింది. స్థానికులు ఒక్కసారే కేకలు వేయడంతో చిన్నారిని అక్కడే వదిలేసి వెళ్లింది. పులి బాలుడి మెడను పట్టుకొని వెళ్లడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది వెంటనే బాలుడిని తిరుపతిలోని పద్మావతి పిల్లల హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలుడు కర్నూల్ జిల్లాకు చెందిన కౌశిక్ గా గుర్తించారు. ఆస్పత్రికి తరలించే సమయంలో చిన్నారిని చూసిన ప్రతిఒక్కరి హృదయాలు చలించిపోయాయి.
పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని శుక్రవారం టీటీడీ చైర్మన్ పరామర్శించారు. చిరుత దాడిలో గాయపడిన చిన్నారి వెంకటేశ్వర స్వామి దయవల్ల క్షేమంగా ఉన్నాడని.. వైద్యులు బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా భరిస్తామని అన్నారు. బాలుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామని.. మరో రెండుమూడు రోజుల్లో బాలుడు క్షేమంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. చిరుత దాడి నేపథ్యంలో భక్తులను గుంపులుగా పంపుతున్నామన్నారు. నడక మార్గంలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.