నాయకుడు అంటే ప్రజలతో నడుస్తూ.. వారి బాగోగులు ఆరా తీస్తూ.. సమస్యలను పరిష్కరిస్తూ.. వారికి అండగా ఉండాలి. జనాలకు ఏదైనా సమస్య వస్తే.. మా నాయకుడు ఉన్నాడు.. మాకేం కష్టం వచ్చినా ఆదుకుంటాడు అనే ధైర్యం కలిగించాలి. అప్పుడు అతడు సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలో ఈ మాటలు అక్షరసత్యం. నిత్యం ప్రజల సంక్షేమం గురించే ఆయన ఆలోచిస్తాడు. మరీ ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసం నిత్యం పరితపిస్తాడు. ఇప్పటికే పేదల సంక్షేమం కోసం జగన్ తీసుకొచ్చిన పథకాలు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. ఇక కష్టమంటూ తన దగ్గరకు వస్తే.. వెంటనే ఆదుకుంటారు సీఎం జగన్. బాధితుల కోసం ఏం చేయడానికైనా వెనకాడారు. జగన్ మంచితనానికి నిదర్శనంగా నిలిచే సంఘటనలు ఇప్పటికే అనేకం చోటు చేసుకోగా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల అప్పలనాయుడు, కృష్ణవేణి దంపతులకు ఇంద్రజ అనే కుమార్తె ఉంది. ఏడేళ్ల ఆ చిన్నారికి.. పెద్ద కష్టమే వచ్చింది. చిన్నారి తల ఆమెకు పెను భారమయ్యింది. ఏడేళ్ల చిన్నారి తల బరువు ఏకంగా 40 కేజీలకు పైగా బరువుంది. దాంతో చిన్నారి నరకం అనుభవిస్తోంది. బిడ్డ బాధ చూసి ఆ తల్లిదండ్రులు నిత్యం గుండెలు పగిలేలా ఏడ్చేవాళ్లు. వైద్యం కోసం అప్పటికే 4 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినా లాభం లేకపోయింది. తమ బిడ్డను బాగు చేయాలంటే.. ఒకటి దేవుడు దిగి రావాలి.. లేదంటే.. ముఖ్యమంత్రి సీఎం జగన్ దృష్టికి తమ బిడ్డను సమస్యను తీసుకెళ్లడం మాత్రమే పరిష్కారంగా భావించారు.
దేవుడు ఎలాగు వారి మొర వినలేదు.. ఇక సీఎం జగన్ మీదనే వారి నమ్మకం. అయితే ముఖ్యమంత్రిని కలవడం అంటే అంత సులువు కాదు. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఈ లోపు సీఎం జగన్ శ్రీకాకుళం నర్సన్నపేటలో భారీ బహిరంగ సభకు హాజరవుతున్నట్లు వారికి తెలిసింది. తమ బిడ్డ కష్టం గురించి సీఎం జగన్కు తెలిస్తే చాలు.. సమస్య పరిష్కారమవుతుందని భావించి.. శ్రీకాకుళం వెళ్లారు. సీఎం జగన్ సభకు హాజరయ్యే సమయంలో ఆయనను కలిసేందుకు ప్రయత్నించడంతో.. అధికారులు అడ్డుకున్నారు.
అయితే వారిని గమనించిన సీఎం జగన్.. కృష్ణవేణి దంపతులను సభ వద్దకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత వారిని పలకరించి.. సమస్య ఏంటో చెప్పమన్నారు. ఇక చిన్నారి ఇంద్రజ పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన సీఎం జగన్.. వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వెంటనే పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ను పిలిచి.. చిన్నారి ఇంద్రజకు అవసరమైన వైద్య, ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. అంతేకాక చిన్నారి ఇంద్రజకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేశారు సీఎం జగన్.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. గురువారం చిన్నారి ఇంద్రజ తల్లిదండ్రలను పిలిపించకుని వారితో మాట్లాడారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు డీఎంహెచ్వో పర్యవేక్షణలో ఇంద్రజను శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు ఇంద్రజకు అవసరమైన చికిత్స, సర్జరీలు చేయిస్తామని.. అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుందని శ్రీకాకుళం కలెక్టర్ తెలిపారు. చిన్నారి చిన్నారి పట్ల సీఎం జగన్ చూపించిన శ్రద్ధకు అక్కడున్న వారు సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ జీవితానికి భరోసా ఇవ్వడమే కాక.. ఆదుకున్నందుకు సీఎం జగన్కి కృతజ్ఞతలు తెలిపారు ఇంద్రజ తల్లిదండ్రులు. దేవుడు తమ మొర వినకపోయినా.. సీఎం జగన్ తమ గోడు విని.. సాయం చేశాడని.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.
ప్రజలోంచి పుట్టిన నాయకుడు @ysjagan 🙏 pic.twitter.com/jLOAXaisyt
— Ross Taylor™ 19:29 ❤️ (@Kiran_reddy7777) November 23, 2022