ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఈసారి కూడా సీఎం జగన్ ఐదుగురికి డిప్యూటీ సీఎం హోజా కల్పించారు. రాజన్నదొర, ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, అంజాద్ బాషా, నారాయణస్వామిలకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఎవరెవరికీ ఏ శాఖ కేటాయిస్తారో అనే చిక్కుముడి కూడా వీడింది. కొత్త కేబినెట్ లో ఎవరికి ఏ శాఖ కేటాయించారో చూద్దాం.
రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)
ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)
కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)
నారాయణ స్వామి : ఎక్సైజ్ శాఖ (డిప్యూటీ సీఎం)
అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
ఆదిమూలపు సురేష్ : మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్మెంట్
బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ
బుగ్గన రాజేంద్రనాథ్ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవరాహాల శాఖ
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్
దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్
గుడివాడ అమర్నాథ్ : పరిశ్రమల శాఖ
గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
జోగి రమేష్ : గృహనిర్మాణ శాఖ
కాకాణి గోవర్థన్రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
ఉషాశ్రీ చరణ్ : స్త్రీ శిశు సంక్షేమ
మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ
పినిపే విశ్వరూప్ : రవాణా శాఖ
ఆర్కే రోజా : పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ
సీదిరి అప్పలరాజు : పశుసంవర్ధక, మత్స్య శాఖ
తానేటి వనిత: హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
విడదల రజిని : వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య
కొత్త మంత్రివర్గంలో బొత్స, బుగ్గన, పెద్దిరెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జయరాం, నారాయణస్వామి, విశ్వరూప్, సీదిరి అప్పలరాజు, తానేటి వనితలకు రెండోసారి మంత్రులుగా అవకాశం దక్కింది. కొత్త మంత్రులు వారి శాఖలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.