చాలా రోజుల నుండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి కోరిక మేరకు సర్కార్ సానుకూలంగా స్పందించింది. అలాగే ఈ ఔట్ సోర్సింగ్ వర్కర్స్కు కూడా గుడ్న్యూస్ తెలిపింది.
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. పేద ప్రజలకు ఆర్థిక సాయంగా కొన్ని పథకాలను అమలు చేస్తుంది. అలాగే ఔట్ సోర్సింగ్ వర్కర్స్కు కూడా గుడ్న్యూస్ తెలిపింది. చాలా రోజుల నుండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి కోరిక మేరకు సర్కార్ సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా భారీగా సాలరీలను పెంచుతూ శుభవార్త తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన జీతం ఆగస్టు నెల 11వ తేదీన అమల్లోకి రానున్నట్లు ఆయన తెలిపారు. దీంతో మొత్తం 27 వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని.. వీరికి 37 శాతం జీతాలు పెంచిందని పేర్కొన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచినట్లు విజయానంద్ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్స్ జీతం రూ.21 వేలు దాటింది. వీరికి గ్రూప్ ఇన్యూరెన్స్ సదుపాయం కూడా కల్పించాలని సర్కార్ కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది. సాలరీల పెంపుపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల్ని పరిష్కరించాలని సమ్మె చేసిన సంగతి అందరికి తెలిసిదే. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీపై ఎట్టకేలకు అంగీకారం తెలిపారు. యాజమాన్యం, ఉద్యోగ సంఘాలు సంతకాలు చేశాయి. దీంతో సమ్మె నోటీసు ఉపసంహరణ అయ్యింది. 8 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి నిర్ణయనం తీసుకున్నామని.. ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే చర్చలతో పరిష్కరించుకుంటామని జేఏసీ నేతలు సంతకాలు చేశారు. మొత్తం 12 డిమాండ్లకు 8 డిమాండ్లు పరిష్కారం అయ్యాయని.. సమస్యలున్నా ప్రజలు ఇబ్బంది పడకూడదని నిర్ణయం తీసుకున్నామని విద్యుత్ ఉద్యోగ సంఘాల నేత సాయికృష్ణ తెలిపారు. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాను భారీగా పెంచిందని తెలిపారు. దీనికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.