అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కుంభ వృష్టిగా వానలు దంచికొట్టాయి. నగరాలన్నీ జలమయమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది.
అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కుంభ వృష్టిగా వానలు దంచికొట్టాయి. నగరాలన్నీ జలమయమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది. చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల వద్దకు వరద నీరు రికార్డు స్థాయిలో వచ్చి చేరింది. లోతట్టు గ్రామాలు నీట మునిగాయి. జాతీయ రహదారులపై నీరు పొంగి పొర్లడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి కొట్టుకుపోయి అనేక మంది తనువు చాలించారు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పశువులు మృత్యువాత పడ్డాయి. ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో పరిస్థితి కాస్త మెరుగనే చెప్పాలి.
ఏపీలో వరద ప్రవాహం ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మురంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు మరింత ముమ్మురం చేయాలని ఆదేశించారు. బాధితులను సహాయ శిబిరాల నుండి ఇళ్లకు పంపే సమయంలో ప్రతి కుటుంబానికి రెండు వేలు చొప్పున, వ్యక్తులైతే వెయ్యి చొప్పున ఇవ్వాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు రూ. 10వేలు నష్టపరిహారం అందించాలని తెలిపారు. వీటితో ఇళ్లకు మరమ్మత్తులు చేయించుకోవాలని తెలిపారు. అలాగే బాధిత కుటుంబానికి రూ. 25 కేజీల బియ్యం, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళా దుంపలు, కిలో పామాయిల్ అందించనుంది జగన్ ప్రభుత్వం.