పిల్లలకు తల్లిదండ్రుల ఇద్దరి ప్రేమ, ఆప్యాయత చాలా అవసరం. కానీ దురదృష్టం కొద్ది దంపతుల్లో ఎవరైనా చనిపోయినా.. విడిపోయినా.. ఆ ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మన సమాజంలో భార్య మరణిస్తే.. చాలా మంది మగాళ్లు.. వెంటనే రెండో పెళ్లి ఆలోచన చేస్తారు. కానీ మహిళలు మాత్రం.. పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. రెండో వివాహం ద్వారా తన జీవితంలోకి వచ్చే వ్యక్తి.. పిల్లలను సరిగా చూస్తాడో లేదో అనే అనుమానంతో.. రెండో పెళ్లి ఆలోచన చేయరు. బిడ్డల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు.
అయితే భర్త మరణించిన తర్వతా మహిళ రెండో వివాహం చేసుకోవడం తప్పు కాదు. కానీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. వారిని గాలికి వదిలి తన దారి తాను చూసుకోవడం మాత్రం పాపమే. ఇలాంటి సంఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. భర్త మరణించాడు. తల్లిదండ్రి తానే అయి పిల్లల భవిష్యత్తు చూసుకోవాల్సిన తల్లి.. వారిని నానమ్మ దగ్గర వదిలి రెండో వివాహం చేసుకుంది. చావుకు కాళ్లు చాపిన తాను.. ఆ బిడ్డల ఆలనాపాలనా సరిగా చూడలేకపోతున్నాని.. తన తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు ఏంటని విలవిల్లాడుతోంది ఆ వృద్ధురాలు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ను అభ్యర్ధించింది. ఆ వృద్ధురాలి ఆవేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.
ఇది కూడా చదవండి: ఆ కుర్రాడి ప్రేమలో కూతురు! తరువాత తల్లి కూడా!
అనంతపురం జిల్లా విద్యుత్ నగర్కు చెందిన లక్ష్మీకి కుమారుడు ఒక్కడే సంతానం. చదువు పూర్తయిన తర్వాత అతడు అనంతపురం జేఎన్టీయూలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. లక్ష్మి కుమారుడికి మేనకోడలి వరసయ్యే మహిళతో వివాహం చేసింది. ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐగా పని చేస్తోంది. ఇక వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. అయితే రెండేళ్ల క్రితం అనగా 2020లో లక్ష్మి కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పిల్లల బాగోలు చూసుకోవాల్సిన లక్ష్మి కోడరు.. వారిని అత్త దగ్గర వద్ద వదిలిపెట్టి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారుల ఆలనా పాలనా నానమ్మే చూసుకుంటోంది. అనంతపురం కలెక్టరేట్లో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో ఓ పెద్దావిడ కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ వద్ద తన గోడు చెప్పుకున్నారు.
ఇది కూడా చదవండి: కొత్త అమ్మాయితో షణ్ముఖ్! ఇంతకీ ఎవరు ఈమె?
‘నా భర్త భర్త చనిపోయాడు. నాకు ఒక్కగానొక్క కొడుకు. కుమారుడే ప్రాణంగా బతికేదాన్ని. నా కొడుకుకు ఇద్దరు పిల్లలు. సంతోషంగా సాగుతున్న నా బిడ్డ జీవితంపై దేవుడు పగపట్టాడు. 33 ఏళ్లకే నా కొడుకును బలిదీసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసే కోడలు అండగా ఉంటుందనుకున్నాను. కానీ, ఆమె తన స్వార్థం చూసుకుంది. ఇద్దరి పిల్లలను నా దగ్గర వదిలేసి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఈ వయసులో ఈ పిల్లల ఆలనా పాలనా నా తరమా! వృద్ధాప్య దశలో ఉన్న నాపై పిల్లల బాధ్యత పెట్టడం న్యాయమేనా? పిల్లల భవిష్యత్ తలచుకుంటుంటే భయమేస్తోంది. బిడ్డలపై కనికరం చూపమని నా కోడలికి మీరైనా చెప్పండమ్మా.. ఈ ఇద్దరు చిన్నారుల భవిష్యత్ కోసం ఓ దారి చూపించండమ్మా..’’ అంటూ ఓ వృద్ధురాలు కలెక్టర్ను వేడుకున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. వృద్ధురాలు లక్ష్మీ వినతిని ప్రత్యేకంగా స్వీకరించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.