ఇటీవల పలువురు రాజకీయ నేతలు కన్నుమూయడంతో ఆయా పార్టీలో తీవ్ర విషాదం నెలకొంటుంది. 6 రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మాజీ కేరళా మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కె.శంకరనారాయణన్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. ఆయన తన స్వగృమం పాలక్కాడ్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతోన్న ఆయన కేరళలోని పాలక్కాడ్లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఆరు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించిన, అంతకు ముందు కేరళ మంత్రిగానూ పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కె.శంకరనారాయణన్ (89) పాలక్కాడ్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త వినగానే కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా గొప్ప నాయకుడిని కోల్పోయామని కంట తడి పెట్టారు.
గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతోన్న ఆయన కేరళలోని పాలక్కాడ్లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కేరళ శాసనసభకు ఎమ్మెల్యేగా ఆయన నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు ఆ తర్వాత మంత్రిగా కొనసాగారు. ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. శంకరనారాయణ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు.