ఒక సామాజిక బాధ్యతతో సుమన్ టీవీ- మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణగారు ఓ యజ్ఞంలా ప్రారంభించిన కార్యక్రమమే ఖడ్గం. ఈ కార్యక్రమం ద్వారా కొందరు యోధులను, వారు ఈ సమాజానికి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు, వారిని చూసి అందరూ ఎంత స్ఫూర్తిని పొందవచ్చు అనే విషయాన్ని తెలిజెప్పే ప్రయత్నం చేశారు. ఓ అనుకోని సంఘటనతో మొత్తం జీవితమే అంధకారంలో కూరుకుపోయింది. కన్న కలలు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. జీవించడమమే ఇంక వ్యర్థం అనుకునే పరిస్థితి నుంచి ఆయనను చూసి ఇంకో వంద మంది స్ఫూర్తి పొందే స్థాయికి ఎదిగారు ప్రసన్న కుమార్. ఓ తాగుబోతు చేసిన తప్పు ఆయన జీవితాన్ని ఏ విధంగా మార్చేసిందో ఖడ్గం కార్యక్రమంలో తెలియజేశారు.
ప్రసన్న కుమార్ వృత్తిపరంగా ఓ ఫొటోగ్రాఫర్. జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. మొత్తం జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్నా, ప్రణాళిక వేసుకున్నారు. మాస్టర్స్ కు విదేశాలు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఓ రోజు నైట్ ఫొటో ఎడిటింగ్ చేసి.. ఇంటి కొచ్చిన తనను ఓ మద్యంతాగి ఉన్న జీపు డ్రైవర్ ఢీకొట్టాడు. ఆయన కుడి కాలు 80 శాతం మేర తెగి వేలాడుతోంది. ఆ క్షణంలోనే అది తిరిగి రాదు అని నిర్ణయానికి వచ్చారు. వైద్యులను ఆ కాలు పూర్తిగా తొలగించాలని సూచించారు. రెండు మేజర్ ఆపరేషన్స్ తర్వాత ప్రసన్న కుమార్ కాలు సెట్ అయ్యింది.
ఆ తర్వాత దాదాపు 6 నెలలు ఇంట్లోనే ఉండిపోయారు. ఎక్కడికి వెళ్లలేదు, ఎవ్వరినీ కలవలేదు. అలాంటి సమయంలో ప్రసన్న కుమార్ అతని కుటుంబం అండగా నిలిచింది. ఆయన బాబాయి నింపిన స్ఫూర్తితో, తల్లి అందించిన తోడ్పాటుతో, తండ్రి చూపించిన ప్రేమతో ప్రసన్న కుమార్ తిరిగి మామూలు మనిషిగా మారారు. ఆ తర్వాత ఒక్క ఫొటోగ్రఫీనే కాదు.. హార్స్ రైడింగ్, బైక్ రైడింగ్, స్విమ్మింగ్ ఇలా సాధారణ వ్యక్తులకు ఏ మాత్రం తీసిపోకుండా అన్ని అంశాల్లో రాణిస్తున్నారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించారు. జీవితం మీద ఆశ కోల్పోయిన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రసన్న కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు, అధిగమించిన తీరు తెలుసుకునేందుకు ఖడ్గం పూర్తి ఎపిసోడ్ ను ఈ కింది వీడియోలో చూడండి. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.