ఒక సామాజిక బాధ్యతతో సుమన్ టీవీ- మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణగారు ఓ యజ్ఞంలా ప్రారంభించిన కార్యక్రమమే ఖడ్గం. ఈ కార్యక్రమం ద్వారా కొందరు యోధులను, వారు ఈ సమాజానికి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు, వారిని చూసి అందరూ ఎంత స్ఫూర్తిని పొందవచ్చు అనే విషయాన్ని తెలిజెప్పే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రుల మూఢనమ్మకాల వల్ల అంధుడైన ఓ వ్యక్తి క్రికెటర్ గా ఎలా ఎదిగాడు అన్నదే మహేందర్ వైష్ణవ్ కథ.
మనిషి జీవితంలో సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే.. మనిషికి అన్ని అవయవాలు ముఖ్యమే. అందులోనూ కళ్లు.. అతి ప్రధానం. సమాజంలో ఏం జరుగుతుందో తెలియాలన్నా, మన కళ్ల ముందు జరిగేది మంచో, చెడో తెలియాలన్నా కళ్లు ఎంతో అవసరం. కానీ, మన సమాజాన్ని పీడిస్తున్న అతి ముఖ్యమైన రుగ్మతల్లో మూఢనమ్మకం ఒకటి. ఆ మూఢనమ్మకం కారణంగా నాటు వైద్యం, తప్పుడు వైద్యం.. ఫలితంగా కళ్లు కోల్పోయాడు. లోకం చీకటైంది. అలాంటి సమయంలో ఇక నా జీవితం వ్యర్థం, నేనేమి సాధించలేను అనుకుంటారు..కానీ వైష్ణవ్ అలా అనుకోలేదు. ప్రతి సవాల్ ని బంతిలా భావించి కసిగా బాదాడు. అందుకు ఫలితం బౌండరీలు.. సిక్సుల రూపంలో వచ్చింది.
అతని శ్రమ, పట్టుదల ముందు అంధత్వం చిన్నబోయింది. జ్ఞాన నేత్రంతో తనలోని ప్రతిభను ఉపయోగించుకొని అంధుల క్రికెట్ లో మన దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. బ్లైండ్ కపిల్ దేవ్ గా గుర్తింపు పొందాడు. ఏ కారణం వల్ల అతను కళ్లు కోల్పోవాల్సి వచ్చింది?. ఆ తరువాత అతను ఎదుర్కొన్న పరిస్థితులేంటి? ఆ విషయాలన్నీ తెలుసుకునేందుకు ఖడ్గం పూర్తి ఎపిసోడ్ ను ఈ కింది వీడియోలో చూడండి. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.