జీవితంలో దురదృష్టం, మృత్యువు ఎప్పుడెలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు సాఫీగా వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. భారీ వర్షం వలన లేదా బ్రేకులు ఫెయిల్ అవ్వడం వలన కూడా వాహనాలు ప్రమాదాలకు గురవుతాయి. చూస్తుండగానే ఎన్నో జీవితాలు కళ్ళముందే హృదయ విదారకంగా ముగిసి పోతుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కుందాపూర్ సమీపంలో ఉన్న షిరూర్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. భారీగా వర్షం పడుతున్న సమయంలో వేగంగా వస్తున్న అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది. అంబులెన్స్ సైరన్ విని టోల్ ప్లాజా సిబ్బంది దారిలో అడ్డంగా ఉన్న బారికేడ్లను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ వేసిట్టున్నాడు.
అసలే వర్షం.. ఆపైన అతివేగం.. అంతే అంబులెన్స్ అదుపు తప్పి బోల్తాలు కొడుతూ టోల్ ప్లాజా బూతును ఢీ కొట్టింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో అంబులెన్స్ లో ఉన్నటువంటి పేషేంట్ తో పాటు సంబంధిత మెడికల్ సిబ్బంది, పేషేంట్ కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం నలుగురు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
Horrific accident of Ambulance at Shirur toll plaza near #Kundapur just now @dp_satish @prakash_TNIE @Lolita_TNIE @BoskyKhanna pic.twitter.com/b9HEknGVRx
— Dr Durgaprasad Hegde (@DpHegde) July 20, 2022