వర్షాకాలం ప్రారంభం అయ్యింది. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం, ఊహించడం కష్టం. ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక భాగ్యనగరంలో వర్ష బీభత్సం ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించేవాడికే తెలుస్తుది. ఇక వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా సహజం. అందుకే వాతావరణంలో కాస్త మార్పు వచ్చినా జాగ్రత్తగా సురక్షిత ప్రదేశంలోకి చేరాలి. అయితే మన దగ్గర చాలా మంది వర్షం ప్రారంభం కాగానే చెట్ల కిందకు పరిగెడతారు. అలా చేయడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పచ్చని చెట్లపై పిడుగులు పడే అవకాశం ఎక్కువ. అలాంటిది మనం వెళ్లి చెట్ల కింద నిల్చుంటే.. ఇదిగో ఇలా కళ్లు మూసి తెరిచేలోగా ప్రమాదం పలకరిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇది చూస్తే.. వర్షాకాలంలో చెట్ల కింద నిల్చోవడం ఎంత ప్రమాదమో అర్థం అవుతుంది.
బ్యూటీఫుల్టీచ్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో అకస్మాత్తుగా ఓ పచ్చని చెట్టుపై పిడుగు పడటం.. అది కాలి పోవడం సెకన్ల వ్యవధిలో జరుగుతుంది. పిడుగు దెబ్బకు చెట్టు బెరడు పూర్తిగా తెగిపోయింది. ప్రమాదం తర్వాత అధికారులు దీని పరసర ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఈ వీడియో తెగ వైరలయ్యింది. ఇప్పటికే 34.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన జనాలు.. ఆ సమయంలో చెట్టు కింద ఎవరైన ఉండి ఉంటే.. ఏం జరిగేదో ఊహించుకోవాలంటేనే భయం వేస్తుంది. ఎంతైనా ప్రకృతి ముందు మనం ఎంత అల్పులమో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.