JC Pura: ఆయన ఓ ప్రజా ప్రతినిధి, ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగి. ప్రజలకు సేవ చేయాల్సిన వీరిద్దరూ ఒకరి సేవలో ఒకరు మునిగిపోయారు. ఏకంగా పంచాయతీ ఆఫీసులో సరసాలు మొదలుపెట్టారు. ఆ సరసాల దృశ్యాలు సీసీ టీవీలో రికార్డవటంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం, తుముకూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాదస్వామి స్వగ్రామమైన చిక్కనాయకహళ్లి తాలూకాలోని జేసిపుర గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్, పంచాయతీ ఆఫీస్లో పనిచేసే మహిళా పీడీఓ ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు.గత కొద్దిరోజులుగా పంచాయతీ ఆఫీస్లో సరసాలు మొదలుపెట్టారు. ప్రసన్న కుమార్ సదరు మహిళా పీడీఓతో సన్నిహితంగా ఉండటం.. ఆమెను ముద్దు పెట్టుకోవటం వంటివి చేస్తున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఎలా బయటకు వచ్చాయో తెలియదు కానీ, ఈ సీసీటీవీ ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పంచాయతీ ఆఫీసులో సరసాలకు పాల్పడిన ప్రసన్న కుమార్ను శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్, మహిళా పీడీఓల సరసాల వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Video: ఇదెక్కడి విడ్డూరం.. మొసలిని పెళ్లాడిన మేయర్.. ఎందుకంటే?