అవినీతిపరులకు సింహస్వప్నంలా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సుమన్ టీవీతో కలిసి చేస్తున్న సరికొత్త ప్రయత్నం పేరే ‘ఖడ్గం’. జ్ఞాన ఖడ్గంతో అజ్ఞానాన్ని చీల్చేద్దాం, ధర్మ ఖడ్గంతో అధర్మాన్ని అంతం చేద్దాం, శాంతి ఖడ్గంతో అశాంతిని తరిమి కొడదాం.. అంటూ ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలపై చర్చించే దిశగా ఖడ్గం కార్యక్రమం ఉండబోతోంది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 8న సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఆ సందర్భంగా విడుదల చేసిన మొదటి ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఆ ప్రోమో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.