విశ్వం, భూమి, ప్రకృతి, నదులు, సముద్రాలు ఇలా మన చుట్టూ ఎన్నో అద్భుతాలు, మరెన్నో రహస్యాలు దాగున్నాయి. వాటిలో మనకు చాలా తెలుసు అనుకున్నా కూడా చాలా విషయాలు మనకు తెలియనివే ఉన్నాయి. ఈ భూమిమీద 70శాతం వరకు సముద్రాలే ఉన్నాయని మనకు తెలుసు. ఆ సముద్రాల్లో ఎంతో నీరు ఉందనీ తెలుసు. ఆ సముద్రాలపై ఆధారపడి కోట్ల మంది మనుషులు, కొన్ని కోట్ల జీవరాశులు బతుకున్న విషయం కూడా తెలుసు. ఇవన్నీ మీకు తెలుసుగానీ, అసలు ఆ సముద్రంలో నీరు ఉప్పగా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? ఏంటీ తెలీదా? అయితే ఇప్పుడు తెలుసుకోండి.
సముద్రాల్లో ఉన్న నీరు దాదాపుగా నదుల నుంచి వచ్చి చేరేదే. మరి ఆ నదుల్లోకి నీరు ఎలా వస్తుంది అంటారా? సముద్రంలో ఉన్న నీరు సూర్యరశ్మికి ఆవిరై మేఘాలుగా మారి వర్షంగా కురుస్తుంది. అవును ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ అనమాట. అయితే సముద్రం నుంచి వర్షం కారణంగా నదుల్లోకి నీరు వస్తాయి బాగానే ఉంది. ఆ నదుల వెళ్లి సముద్రంలో కలుస్తాయి అదీ బాగానే ఉంది. కానీ, నదుల్లో నీరు తియ్యగా తాగేందుకు వీలుగా ఉంటుంది. కానీ, ఆ నదుల నీరు కలిసే సముద్రంలో నీరు మాత్రం ఉప్పగా ఉంటుంది. అందుకు కారణాలు లేకపోలేదు. అయితే చాలామందికి ఆ కారణాలు తెలియకపోవచ్చు.
నదులలో ప్రవహించే నీటి గాఢత తక్కువగా ఉంటుంది. అందుకే నదుల్లో ఉండే నీరు అంత ఉప్పగా ఉండదు. అంతేకాకుండా నదుల్లో నీరు అనేది ఒక దగ్గర స్థిరంగా ఉండదు.. ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ, సముద్రంలో ఉండేనీరు ఒకే దగ్గర స్థిరంగా ఉంటుంది. దానికి ప్రవహించే అవకాశం లేదు. ఆ కారణం చేత కూడా సముద్రం నీరు గాఢత పెరిగి ఉప్పగా ఉంటుంది. అంతేకాకుండా నదులు ప్రవహించే క్రమంలో భూమి, రాళ్లు, ఒడ్డుపై ఉండే లవణాలను నదులు- సముద్రాల్లోకి తీసుకెళ్తాయి. ఆ లవణాలకు బయటకు వెళ్లే అవకాశం లేక.. కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఒకే చోట కదలికల లేకుండా స్థిరంగా ఉండిపోయిన సముద్రాల్లో లవణ గాఢత పెరిగి నీరు అలా ఉప్పగా తయారయ్యాయి.