ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయల్లో తండ్రి వారసత్వన్ని పుణికి పుచుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ(వైఎస్సార్టీపీ) పార్టీని స్థాపించింది. ఈక్రమంలో నిత్యం ప్రజలతో మమేకమై…వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అధికార పార్టీ తెరాసపై వైఎస్ షర్మిల ఓరేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రమంత కలియతిరుగుతు ఉన్నిక చాటుకుంటున్నారు. తాజాగా ఇటీవల ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల విషయంలో షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
త్వరలో మునుగోడు జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ) కూడా పోటీ చేయనుంది. మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఉనికి చాటుకోవాలని షర్మిల భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ఈక్రమంలో బీసీ అభ్యర్ధిని ఎన్నికల బరిలో నిలపాలని ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తమ అభ్యర్థిని పోటీలోకి దించాలని పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈ క్రమంలోనే మునుగోడు అసెంబ్లీ స్థానంలోని రాజకీయ పరిణామాలు, పార్టీల బలాబలాలపై కూడా సర్వే చేయించారు. ఈ సర్వే రిపోర్ట్ ఎలా ఉన్నప్పటికీ ఉపఎన్ని పోటీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీ స్థాపించిన తరువాత వచ్చిన తొలి ఎన్నికలో కావడంతో మునుగోడుపై షర్మిల గట్టిగా ఫోకస్ చేశారు. తెరాస, కాంగ్రెస్, భాజపా పార్టీల ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కోవాలని వైఎస్సాఆర్ టీపీ భావిస్తోంది. అందులో భాగంగానే మునుగోడులో బీసీ అభ్యర్థి ప్రతిపాదనను తెర మీదకు తెచ్చింది. అలా అయితే మూడు పార్టీలకు గట్టి పోటీ ఇవ్వొచ్చని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు బలమైన బీసీ అభ్యర్థి గురించి అన్వేషిస్తున్నారు. బలమైనఅభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఓ కమిటీని కూడా వేసింది. మరి.. మునుగోడు ఉపఎన్నికల్లో వైఎస్సాఆర్ టీపీ పోటీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.