వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. తాజాగా తెలంగాణలో మరో వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి వరుసగా గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి గుండె పోటు వస్తుంది. కబడ్డీ ఆడుతూ, జిమ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ.. ఇలా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలుతున్నారు. గత వారం వారం రోజుల నుంచి ఇప్పటికీ చాలా మంది చనిపోయారు. ఇక ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాం నగర్ కాలనీలో సంతోష్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతను తాజాగా ఫోన్ లో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఇతను అప్పటికే గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు. ఈ వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అయితే ఎంతో యాక్టివ్ గా ఉండే సంతోష్.. ఒక్కసారిగా గుండెపోటుతో మరణించడంతో గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లాలో గత వారం రోజుల నుంచి గుండెపోటుతో ఇప్పటికి నలుగురు మృతి చెందడం విశేషం. వరుస గుండెపోటు మరణాలపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.