ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం టీఎస్ ఆర్టీసి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సాఫ్ట్వేర్ కంపెనీలకు అద్దెకు బస్సులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటిదాకా.. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉద్యోగులను సాఫ్ట్వేర్ కంపెనీలకు చేరుస్తున్న.. ఆర్టీసి, ఇకపై అద్దెకు బస్సులు ఇచ్చేటందుకు సిద్ధమైంది. ఇప్పటికే.. ఈ విషయంపై 20 పైగా సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. అలా అద్దెకిచ్చిన బస్సులకు కిలోమీటర్ల వారీగా చార్జీలు వసూలు చేయనున్నారు. అందుకు సంబంధించిన చార్జీల వివరాలను విడుదల చేశారు.
సిటీ ఆర్డినరీ బస్సుకు కనీసం 40 నుంచి 79 కిలోమీటర్లు వరకు.. నెలకు రూ.59,280 వసూలు చేయనుండగా, 80కిలోమీటర్లలకు పైగా బస్సులకు రూ.1,20,240 వసూలు చేయనున్నారు. అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులకు కనీసం 40 నుంచి 79 కిలోమీటర్ల వరకు రూ.64,480, 80కిలోమీటర్లలకు పైగా ఉన్న బస్సులకు రూ.1,18,560 వసూలు చేయనున్నారు. ఇక మినీ బస్సులకు విషయానికొస్తే.. 40 నుంచి 79 కిలోమీటర్ల వరకు రూ.60,320, 80కిలోమీటర్లలకు పైగా ఉన్న వాటికి రూ.1,06,080 చొప్పున అద్దె వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ అధికారులు తెలిపారు.