తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ ఆర్టీసీలో ఎన్నో కీలక మార్పులు తీసుకువచ్చారు. ప్రజలు ఎక్కువ శాతం ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా పలు పథకాలు అందుబాటులోకి తెస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఎన్నో వినూత్న పథకాలు తీసుకు వస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. నష్టాల ఊబిలో కూరుకు పోయిన ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీని అభివృద్ది చేసేందుకు, అదే విధంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. పండుగల సందర్భంగా మహిళల కోసం, విద్యార్థుల కోసం స్పెషల్ ఆఫర్స్ కల్పిస్తున్నారు. తాజాగా ఎండీ సజ్జనార్ టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త తెలిపారు. వివరాల్లోకి వెళితే.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పటికప్పుడు ప్రజల సౌకర్యార్థం కొత్త కొత్త స్కీమ్స్ ని ప్రవేశ పెడుతున్నారు. ఓ వైపు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ.. మరోవైపు టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తాజాగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. బెంగుళూరు, విజవాడ మార్గాల్లో నిత్యం వేల సంఖ్యల్లో ప్రయాణికులు తమ ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. ఈ రెండు నగరాల మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరపై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు రానూపోనూ ఒకే సారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ ఉంటుంది.
సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగుళూరు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ ఆలోచించింది. ఈ డిస్కౌంట్ వల్ల ప్రయాణికులకు విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగుళూరు మార్గంలో రూ.100 వరకు ఆదా అవుతుంది. కాగా, ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో ఆదివారం ( జూలై 2వ తేదీ) ఈ రాయితీ సౌకర్యం కల్పించబడుతుందని తెలిపింది. అయితే ఈ రాయితీ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండనుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికార వెబ్ సైట్ www.tsrtconline.com ను సంప్రదించవొచ్చు.