తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ పై కాంగ్రెస్, బీజేపీలు మండి పడుతున్నాయి. రాహూల్ గాంధీ తెలంగాణలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారి సమస్యల గురించి మంగళవారం తెలుగు లో ఒక ట్వీట్ చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. రాహూల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చైర్మన్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓ నాన్సెన్స్ అయితే, రేవంత్ రెడ్డి ఓ న్యూసెన్స్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అదే విధంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై కూడా ఘాటు వ్యాఖ్యలు సంధించారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ అంటే ఏంటో తెలుసని.. అందుకే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల దీవెనలతో సీఎం అయ్యారని అన్నారు. ఆయన సీఎం పదవిలోకి వచ్చి తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారని.. అందుకే ప్రజల తమ వైపు ఉన్నారని అన్నారు.
రైతుల కోసం కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంజాబ్ లో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందని.. దానికి కారణం రాహూల్ గాంధీ ఐరన్ లెగ్.. ఇక తెలంగాణ లో రేవంత్ రెడ్డి ఓ ఐరెన్ లెగ్గేనని చెప్పిన జీవన్.. రేవంత్కు టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ మనుగడ లేకుండా పోయిందని విమర్శించారు.