దేశంలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులోనూ, బీజేపీ ఎత్తుగడలు ఎవరకి అంతుపట్టడం లేదు. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్, టీమిండియా మాజీ మహిళా సారధి మిథాలీ రాజ్ తో సమావేశం కానున్నారు. దీని వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటన్నది అంతుచిక్కడం లేదు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వరంగల్లో బీజేపీ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కోసం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఇప్పటికే, ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ వెళ్లనున్న నడ్డా, బీజేపీ శ్రేణులతో పాటు, టీమిండియా మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్తో భేటీ కానున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్కు వెళ్తారు. సభ అనంతరం హైదరాబాద్కు జేపీ నడ్డా తిరుగుపయనం మయ్యాక, రాత్రి 7.30 గంటలకు నోవాటెల్లో సినీ నటుడు నితిన్తో భేటీ కానున్నారు. అలాగే.. టీవీ9 యజమాని, మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్ రావుతో కూడా జేపీ నడ్డా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి.
Former cricketer Mithali Raj meets BJP national president JP Nadda in Hyderabad, Telangana. pic.twitter.com/WuvbdA4L9y
— ANI (@ANI) August 27, 2022
జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ రాజకీయాలకు సంబంధించింది కాదని.. ఇప్పటికే బీజేపీ వర్గాలు ప్రకటించాయి. జూనియర్ ఎన్టీఆర్ తాతగారు దివంగత సీనియర్ ఎన్టీఆర్ ప్రముఖ రాజకీయ నాయకుడు కనుక, ఎన్టీఆర్తో అమిత్ షా భేటీలో కాస్త అర్థముంది. కానీ, నితిన్, మిథాలీ రాజ్తో జేపీ నడ్డా ఎందుకు భేటీ అవుతున్నట్లు? దీని వెనుకున్న రహస్యం ఏంటి? అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ సమావేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: జూనియర్ NTRను కలిసిన అమిత్ షా.. ఆయన ఏమన్నారంటే?
ఇదీ చదవండి: బ్రేకింగ్: అమిత్ షాతో జూనియర్ NTR లంచ్ భేటీ.. ఎందుకంటే?