ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.[1] భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరు అవుతారు. దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మేడారంలో విషాదం చోటు చేసుకుంది. మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య(38) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాంబయ్య బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
వెన్నెముక నొప్పి అధికం కావడంతో ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం మోరుమూరు గ్రామంలో నాటు వైద్యుడిని కలిశాడు. అక్కడ ఆయనకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఏర్పడడంతో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో సాంబయ్య మృతి చెందాడు. ప్రధాన పూజారులకు సహ పూజారిగా సాంబయ్య వ్యవహరించారు. అనారోగ్యం కారణంగా ఈ యేడాది జరిగిన మహాజాతర పూజల్లో పూజారి సాంబయ్య పాల్గొనలేదు. సమ్మక్క సారలమ్మ పూజారి సిద్దిబోయిన సాంబయ్య మృతి చెందడంతో మేడారం గ్రామం ప్రజలు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయాడు.