యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్టలో ఓ రెండతస్తుల పాత భవనం కుప్పకూలి నలుగురు మృతి చెందారు. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న శ్రీరాంనగర్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కుప్పకూలిన రెండంతస్తుల భవనం దాదాపు 35 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో మృత్యువాతపడిన దశరథ్ గౌడ్, శ్రీను, ఉపేందర్, శ్రీనాథ్ లు యాదగిరిగుట్టకు చెందినవారని పోలీసులు గుర్తించారు.
Yadagirigutta 2 floor building collapse video pic.twitter.com/S0ik8FTI1h
— ARJUN REDDY (@ARJUNRE49384282) April 29, 2022
కూలిన పాత భవనానికి ముందు భాగంలో రెండు దుకాణాలు ఉండగా, వెనుక భాగంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రమాద సంభవించిన సమయంలో ఇళ్లలో, దుకాణాల్లో ఉన్నవారితోపాటు అక్కడున్న పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మరి ఈ ఘోర ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.