పాములు అనగానే అందరికీ భయమే.. చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. అదే నాగుపాము అంటే.. ఆ దరిదాపుల్లో కూడా కనిపించరు. కానీ.., మహాశివరాత్రి పర్వదినం నాడు పాములు ఆశీర్వాదం అందిస్తే..! అదికూడా.. ఐదేళ్లుగా ప్రతి ఏడాది వస్తుంటే.. అది శివయ్య లీల అనుకోకుండా ఉండగలమా?. పరమ శివుడి కంఠాభరణమైన నాగుపాము ఆలయ గర్భగుడిలో దర్శనమిచ్చింది. శివరాత్రి పర్వదినం రోజునే ఇలా జరగడంతో.. భక్తులు దీనిని శివలీలగా భావిస్తున్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గొడిసెర్యాల గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాలలో మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకుంటారు. అంతటి పుణ్యదినాన శివుడి కంఠాభరణమైన నాగుపాము ఆలయ గర్భగుడిలో దర్శనమిచ్చింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలియగానే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఐదేళ్లుగా ప్రతి ఇధాధి క్రమం తప్పకుండ.. శివరాత్రి రోజున పాము దర్శనమిస్తున్నట్లు చెప్తున్నారు. శివరాత్రి పర్వదినం రోజునే ఇలా జరగడంతో భక్తులు.. ఇదంతా శివుడి లీలగా భావించి పూజలు చేస్తున్నారు. రద్దీని కంట్రోల్ చేయడానికి పోలీసులు రంగ ప్రవేశం చెల్సీ వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆలయ పూజారి లక్ష్మణ్ స్వామి మాట్లాడుతూ.. గత ఐదేండ్ల నుంచి క్రమం తప్పకుండా శివరాత్రి పర్వదినం నాడు ఆలయ గర్భగుడిలోకి నాగుపాము వచ్చి పూజలు అందుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో భక్తులు ఆ పాముకు ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.