ఈ మద్య రాజకీయ నేతలు పలు సందర్భాల్లో తమ మానవత్వాన్ని చాటుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రోడ్డుపై ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కాన్వాయ్ ఆపి మరి ప్రమాదంలో ఉన్నవారిని రక్షించిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి ఓ వ్యక్తికి యాక్సిడెంట్ జరగడాన్ని చూసి వెంటనే చలించిపోయారు. ఏనుగొండ వద్ద జేజేఆర్ గార్డెన్ సమీపంలో మల్లేష్ అనే వ్యక్తి బైక్పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై.. అచేతనంగా పడి ఉన్నాడు.
అటుగా వెళ్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి విషయం తెలియగానే కారు దిగి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అతడికి మంచినీళ్లు అందించి వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అంతే కాదు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే సమయం అయినా కూడా ఆ వ్యక్తిని ఆసుపత్రిలో తరలించేదాకా అక్కడే ఉండి.. అతడిని స్వయంగా అంబులెన్స్ ఎక్కించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మానవత్వం చాటుకున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.