తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు… ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. బెయిల్ పై విడుదలైన బండి… తనకు అవమానం జరిగిందని జాతీయ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. దీనిపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో బండి ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని అరెస్టుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది ప్రివిలేజ్ కమిటీ. అంతేకాక తెలంగాణ డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీకి కూడా లోక్సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ ఇన్స్పెక్టర్కు కూడా నోటీసులు ఇచ్చింది.
ఇది కూడా చదవండి : బండి సంజయ్ కాలర్ పట్టుకున్న పోలీసు! రంగంలోకి అమిత్ షా!
లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముందు శుక్రవారం బండి సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చారు. కరీంనగర్ లో చోటుచేసుకున్న ఘటన వివరాలు తెలిపారు. పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరును కమిటీ ముందు వివరించారు. కరీంగనర్ లోని తన క్యాంపు క్యార్యాలయంలో తాను జాగరణ దీక్షకు దిగగా.. పోలీసులు తలుపులు పగులగొట్టి మరీ లోపలకు వచ్చి తనను అరెస్ట్ చేశారని.. పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని తెలిపారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టారని తెలిపారు. బండి సంజయ్ స్టేట్ మెంట్ ఆధారంగా ప్రివిలేజ్ కమిటీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : బీజేపీ vs టీఆర్ఎస్.. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?