హైకోర్టు తీర్పు కారణంగా సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు రిలీవింగ్ నేపథ్యంలో తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎవరనేది ఉత్కంఠగా మారింది. సీఎస్ నియామకం విషయంలో సీఎం కేసీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర కొత్త సీఎస్ రేసులో ముగ్గురు అధికారుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర కేడర్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా, రాణి కుముదిని, శాంతి కుమారి, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్, రామకృష్ణారావు, […]
గత కొంతకాలంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాలా? తెలంగాణలో ఉండాలా? అన్న విషయంపై హైకోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం తాజాగా తన తీర్పును వెలువరించింది. గతంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్ లో కొనసాగడానికి వీలులేదని, ఆయన తిరిగి ఏపీ కేడర్ కు వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని […]
తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొద్ది రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. వారం క్రితం ఉత్తరప్రదేశ్ సీఎం ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరైన సీఎం.. అటునుంచి అటే ఢిల్లీకి పయనమయ్యారు. అప్పటినుంచి కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. టీఆర్ఎస్ ఢిల్లీలో లీజుకు తీసుకున్న భవనం మరమ్మతులను పరిశీలించారు. అంతేకాకుండా పార్టీ కోసం కొత్తగా నిర్మిస్తున్న భవనం పనులను కూడా పరిశీలించి.. పలు సూచనలు, సలహాలు అందించారు. వారం రోజులుగా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ ఉన్నారు. తాజాగా […]
ఇటీవల సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, సీనియర్ అధికారుల ఇంట విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రస్తుత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. సోమేశ్కుమార్ తల్లి మీనాక్షి సింగ్ కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మీనాక్షిసింగ్ కన్నుమూశారు. ఆమె సొంతూరు పాట్నాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్థివ […]
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజూకీ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఎండల దెబ్బకు జనాలు అల్లాడుతున్నారు. ఇక మూగ జీవాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు.ఈ సారి ఉష్ణోగ్రతలు గతేడాది కంటే పెరిగాయి. దీంతో ఇప్పుడే ఈ స్థాయిలో ఎండలు అదరగొడుతుంటే.. రానున్న రానున్న రేపటి నుంచి ఎండలతో పాటు తీవ్రమైన వడగాలులు కూడా వీస్తాయని వాతారవరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఎండలు ఉండనున్నాయి. ఈ నాలుగు రోజులు […]
రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పథకం దళితబంధు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దత్తర గ్రామం వాసాలమర్రి హుజూరాబాద్ నియోకవర్గాల్లో పైలెట్ పద్దతిలో పూర్తి స్థాయిలో పథకం అమలవుతోంది. అలానే ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ నాలుగు మండలాల్లో కూడా […]
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు… ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. బెయిల్ పై విడుదలైన బండి… తనకు అవమానం జరిగిందని జాతీయ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. దీనిపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బండి ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ […]
హైదరాబాద్- తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబందించి కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీల విషయంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలు చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. భార్యా భర్తలను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు వచ్చిన వినతులు, అభ్యంతరాలనూ వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ […]
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఉన్న వెంకట్రామి రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి సోమశేఖర్ కుమార్ కు అందజేశారు. పి.వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం ఇందుర్తి గ్రామం. గతంలో.. యాసంగిలో వరిపంట వేయవద్దని, ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయాలని రైతులకు సూచించారు. రైతులు ఇతర పంటలు వేసే విషయం మండల అధికారులు చూసుకోవాలని, సీడ్ […]
హైదరాబాద్- తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కాస్త బెటర్ గానే ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మందులు, వ్యాక్సిన్, ఆక్సిజన్, బెడ్ లకు ఎలాంటి కొరత లేదని సోమేష్ కుమార్ తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయన్న ఆయన, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్స్ తో పాటు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ […]