Hyderabad: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి జనాలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు వారంపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో మరోసారి మబ్బులు కమ్మేశాయని, మరో 24 గంటల వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ప్రధాన ఏరియాలలో జోరువాన కురుస్తోంది. ఈ జోరువానకు సిటీ అంతా అతలాకుతలమవుతోంది. అనేకచోట్ల రహదారులన్నీ జలమయం అయిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు సైతం ట్రాఫిక్ జామ్స్తో ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే టైమ్ కావడంతో.. వరదనీటిలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని అంటున్నారు. ఇక హైదరాబాద్ లో వర్షాలపై GHMC మేయర్ సమీక్ష నిర్వహించారు. జోనల్ కమిషనర్లతో ఫోన్ కాన్ఫరెన్స్ లో చర్చించిన మేయర్ విజయలక్ష్మి, ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు, సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఆపరేషన్స్ కంటిన్యూ చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి కంప్లైంట్స్ వస్తే వెంటనే స్పందించాలని, క్షణాల్లో సమస్యను పరిష్కరించాలని సూచించారు. యంత్రాంగమంతా 24గంటలూ అందుబాటులో ఉండాలని మేయర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రజలు కూడా అత్యవసర సమస్యలుంటే GHMC కంట్రోల్ రూమ్ నంబర్స్కు( 040-21111111, 040-29555500) సంప్రదించాలని మేయర్ సూచించారు.
Heavy Downpour in Jeedimetla (#Quthbullapur) ⛈️#HyderabadRains pic.twitter.com/CskU8utkPD
— Hyderabad Rains (@Hyderabadrains) July 28, 2022