నేటి కాలంలో సోషల్ మీడియా వాడకం విస్తృతంగా ఉంది. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ సామాజిక మాధ్యమాల వలన లాభనష్టాలు రెండు ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఒకప్పుడు ఆ ప్రాంతం వారికి మాత్రమే తెలిసేది. కానీ నేడు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వలన చాలా మంది పడుతున్న కష్టాలు బయటి ప్రపంచానికి తెలిసి పరిష్కారం లభిస్తుంది. అలానే ఓ కుటుంబం.. ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు
పడుతుంది. సోషల్ మీడియా ద్వారా వారి కష్టాలు తెలుసుకున్న కొందరు.. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి వారిని ఆదుకున్నారు. తాజాగా ఇది జగిత్యాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఇది కూడా చదవండి : పోర్న్ స్టార్ మియా ఖలీఫా మృతి అంటూ వార్తలు!
జగిత్యాల జిల్లా బీర్ పూర్ కు చెందిన గంగారం అనే వ్యక్తి అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబ భారమంతా.. భార్య అంజలి పై పడింది. కూలీ చేసుకుంటూ ఇద్దరి కూతుర్లతో పూరి గుడిసెలో జీవనం సాగించేది. పెద్ద అమ్మాయి డిగ్రీ ఫస్టియర్, చిన్న అమ్మాయి స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. వీరు పూరిగుడిసెలో ఉంటూ వర్షానికి, చలికి ఇబ్బందులు పడుతుండేవారు. మంచి ఇళ్ల కట్టించుకుందామా అంటే అంత ఆర్థిక స్థోమత లేదు. పిల్లల చదువులకు, ఇంటి పోషణకే అంజలి కూలి డబ్బులు సరిపోయేవి. అలానే వారి జీవితాన్ని నెట్టుకోస్తున్నారు. వారి ఇబ్బందులను స్థానికుల ద్వారా ధర్మపురికి చెందిన సామాజిక కార్యకర్త రమేశ్ తెలుసుకున్నారు. వారికి ఏదైనా సాయం చేయాలని భావించిన రమేశ్.. తన ఫేస్ బుక్ ద్వారా ఆ కుటుంబం పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించి, సాయం చేయాల్సిందిగా కోరాడు.
రమేశ్ పోస్టుకు స్పందించిన ఎన్నారైలు, మరి కొందరు.. అంజలి బ్యాంకు ఖాతాలోకి డబ్బులు పంపారు. అంజలి కోరిక మేరకు ఆ డబ్బుతో బీర్ పూర్ లో ఇంటిని నిర్మిస్తున్నారు. తమ ఇబ్బందులు చూసి ఆదుకున్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు అంజలి కుటుంబ సభ్యులు. చూశారా..మనం ఆర్థిక సాయం చేయలేకపోయిన.. కనీసం రమేశ్ లాగా మన చుట్టు పక్కల వారికి ఉండే సమస్యను ప్రపంచానికి తెలియజేసినా అదే నిజమైన సాయం అవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.