ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ఆ పాఠశాల ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అత్యాచారంకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. సభ్య సమాజం తనలదించుకునేలా చేసిన ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి కఠినమైన శిక్షపడాలని పలువురు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. సదరు పాఠశాల గుర్తింపును రద్దు చేసింది. పోలీసులు నిందితుడితో పాటు ప్రిన్సిపల్ ను కూడా అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆవేదన వ్యక్తం చేశారు.
ఆధునిక సమాజంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. శేఖర్ కమ్ముల పోస్టులో..”నగరంలోని డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఇది చాలా దారణమైన ఘటన. అభం శుభం తెలియని ఆ చిన్నారి పడే ఆవేదనను ఊహించలేకపోతున్నాను. నిస్సహాయతతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఎంతో ధైర్యంతో న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాలిక తల్లిదండ్రులకు జోహర్లు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. ఆధునిక సమాజంలో ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకూడదు. ప్రతి ఒక్కరు మేల్కొని పిల్లల భద్రతకు అనుకూల వాతారవరణం కల్పించాలి.
మన పిల్లల రక్షణ విషయంలో రాజీపడితే.. దారణమైన సమాజాన్ని రూపొందించినవారవుతాం” అంటూ శేఖర్ కమ్ముల తన ఆవేదనను తెలియజేశారు. నాగచైతన్య, సాయిపల్లవిగా జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవల ‘లవ్ స్టోరీ’ అనే మూవీ అనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా లైంగిక వేధింపులకు సంబంధించినదే. తమ బంధువులు, చుట్టు పక్కల వారు ఆడపిల్లలపై ఏ విధంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో శేఖర్ కమ్ముల ఈ సినిమాలో చూపించారు. తాజాగా అలాంటి ఘటనే జరగడంతో ఆయన ఆవేదనతో తన స్పందనను తెలియజేశారు.
#DAVPublicSchool pic.twitter.com/JLpFVpRLLp
— Sekhar Kammula (@sekharkammula) October 21, 2022