దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ప్రతిరోజు కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతిరోజూ రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 415కు పెరిగింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ నుంచి 115 మంది కోలుకున్నారు. అయితే కరోనా నిర్ధారణ అయిన వారు పద్నాలు రోజులు క్వారంటైన్ లో ఉండి సరైన చికిత్స తీసుకొని కోలుకుంటున్న విషయం తెలిసిందే.
తాజాగా యూపీకి చెందిన ఓ బాలుడు కరోనాను జయించాడు. భారత్లో ఎక్మో చికిత్సతో ప్రాణాలతో నిలిచిన వ్యక్తి ఈ బాలుడే అని వైద్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. యూపీ రాజధాని లక్నోకు చెందిన 12 ఏళ్ల బాలుడు శ్వాస సమస్యతో బాధ పడుతుండడంతో మొదట స్థానికంగా ఒక ఆస్పత్రిలో చేర్పించారు. ఒక దశలో బాబు పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగించింది. కానీ తమ 12 ఏళ్ల కుమారుడిపై తల్లిదండ్రుల ఆశలు కోల్పోలేదు. కరోనాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాకానీ, గుండె ధైర్యం కోల్పోలేదు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ కు ఎయిర్ అంబులెన్స్ లో తరలించారు తల్లిదండ్రులు.
ఇది కూడా చదవండి : బ్యాంకు ఖాతాదారులకు హై అలర్ట్ ప్రకటించిన RBI..
ఇక పరీక్షల్లో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించిన వైద్యులు వెనో వీనస్ ఎక్మో పరికరంతో రెండు నెలల పాటు కృత్రిమంగా శ్వాస అందిస్తూ.. క్రమంగా ఆరోగ్య పరిస్థితిని కుదుటపడేలా చేశారు. ఆ తర్వాత ఎక్మో సాయాన్ని క్రమంగా నిలిపివేశారు. దేశంలో ఎక్మో చికిత్సపై ఎక్కువ రోజుల పాటు ఉండి, ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఇతడేనని వైద్యులు తెలిపారు. పోషకాహారాన్ని పెంచి ఇవ్వడం, ఫిజికల్ రీహాబిలిటేషన్, అడ్వాన్స్ డ్ లంగ్ రికవరీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైద్యుల కృషి ఎనలేనిదని బాలుడి తల్లి దండ్రులు కొనియాడారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.